నాడు నయం.. నేడు దయనీయం!
‘విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 200కు పైగా అదనపు తరగతి గదులు అవసరం. గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిపడా గదులు లేవు.
తరగతి గదుల నిర్మాణమంటూ హడావుడి
ఏడాదిన్నరగా సాగుతున్న రెండో దశ పనులు
విజయవాడలోని ఓ పాఠశాలలో చెట్ల కిందే విద్యార్థులకు బోధన
ఈనాడు, అమరావతి: ‘విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 200కు పైగా అదనపు తరగతి గదులు అవసరం. గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిపడా గదులు లేవు. నాడు నేడులో భాగంగా అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నామంటూ గత రెండేళ్లుగా చెబుతున్నారు. చాలా పాఠశాలల్లో ఇసుక, సిమెంట్ బస్తాలు, ఇటుకలు సహా సామగ్రి వచ్చినా ఏడాదిన్నరకు పైగా నిర్మాణాలు సాగదీస్తున్నారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగరంలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్న ప్రతి పాఠశాలలోనూ తరగతి గదుల కొరత వేధిస్తోంది. ఉన్న గదుల్లోనే విద్యార్థులను ఇరికించి కూర్చోబెడుతున్నారు. పరీక్షల సమయంలో ఆరుబయట చెట్ల కింద, వరండాల్లో కూర్చోబెట్టాల్సి వస్తోంది.’
కృష్ణా, ఎన్టీఆర్ రెండు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రెండు జిల్లాల్లోని 600కు పైగా పాఠశాలల్లో రెండో దశ నాడు నేడులో భాగంగా మరుగుదొడ్లు-నీటి సౌకర్యం, పాఠశాలలో విద్యుత్తు ఉపకరణాలు, ఇంగ్లీష్ ల్యాబ్, వంట గది షెడ్డు, ప్రహరీ, తాగునీరు, ఫర్నీచర్, భవనాలకు రంగులు, గ్రీన్ చాక్ బోర్డులు, చిన్న మరమ్మతుల పనులు ఆరంభమయ్యాయి. వీటిలో 168 పాఠశాలల్లో 1088 అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రెండో దశలో భాగంగా ఏడాదిన్నర కిందట ఆరంభించారు. ఇప్పటికీ నత్తనడకన తరగతి గదుల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరగడమే దీనికి కారణం. ఇసుక, సిమెంట్ లాంటి నిర్మాణ సామగ్రిని ఆలస్యంగా పంపించడం, సమయానికి నిధులు ఇవ్వకపోవడంతో.. ఒక నెల పని జరిగితే.. నాలుగు నెలలు ఆగిపోవడం, మళ్లీ కొద్దిగా చేపట్టడం.. ఇలా సాగదీస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం పూర్తిగా ఆపేశారు..
గత రెండేళ్లుగా తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి నిధులు విడుదల చేయలేదు. ఎప్పుడో ఒకసారి రివాల్వింగ్ ఫండ్ను ఖాతాల్లో వేయడం.. పనులు త్వరగా చేయించాలంటూ ప్రధానోపాధ్యాయులను ఉరుకులు పరుగులు పెట్టించడం.. ఆ తర్వాత మళ్లీ చాలా నెలలు ఆపేయడం జరుగుతోంది. రెండో దశలో రూ.72 కోట్లతో 1088 తరగతి గదులను ఉమ్మడి కృష్ణాలో చేపడతామంటూ రెండేళ్ల కిందట ప్రకటించారు. వీటిలో కృష్ణాలో రూ.28 కోట్లతో.. 67 పాఠశాలల్లో 298 గదులు, ఎన్టీఆర్ జిల్లాలో రూ.44 కోట్లతో 790 అదనపు గదులు నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఈ గదులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో భవనాల నిర్మాణం పూర్తయినా వాటికి తుది దశ మెరుగులు దిద్ది ఆరంభించడానికి కూడా నిధులు లేక వదిలేశారు.
రెండు జిల్లాల్లోనూ ఇబ్బందే..
కృష్ణా జిల్లాలో రెండో దశలో భాగంగా రూ.100 కోట్లతో 287 పాఠశాలల్లో పనులు చేపడతామన్నారు. ఆరంభంలో రూ.10కోట్ల రివాల్వింగ్ ఫండ్ను పాఠశాలల ఖాతాల్లో వేశారు. వాటితోనే ఆరంభంలో పనులు జోరుగా సాగాయి. తర్వాత నుంచి నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ రూ.156 కోట్లతో 372 పాఠశాలల్లో రెండో దశ పనులు ఆరంభించారు. రూ.20 కోట్లు రివాల్వింగ్ ఫండ్ను ఆరంభంలో పాఠశాలల ఖాతాల్లో వేశారు. ఆ తర్వాత నుంచి నిధుల కొరత, ఇసుక, సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి రావడానికి ఆలస్యం అవ్వడంతో.. పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో నిధులు లేక పనులు పూర్తిగా ఆపేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం