logo

రైతులకు నష్టపరిహారాన్ని అందించాలి

జిల్లాకు కూరగాయలు అందించే మోపిదేవి మండలానికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు.

Updated : 08 Dec 2023 17:58 IST

మోపిదేవి: జిల్లాకు కూరగాయలు అందించే మోపిదేవి మండలానికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. మోపిదేవి మండలం కోసూరువారిపాలెం, పరిసర గ్రామాల్లో కూరగాయల తోటలకు కలిగిన నష్టాన్ని పరిశీలించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉద్యానవన తోటల రైతులకు వైకాపా ప్రభుత్వం సహాయం చేయట్లేదన్నారు. తెదేపా హయాంలో ఎకరాకు రూ.20 వేలు సహాయం చేశామని వెల్లడించారు. అరటి తోటలు, చిక్కుడు, టమాటా తోటలు నాశనమైనా కనీసం ఎమ్మెల్యే ఇక్కడి రైతులను పలకరించలేదని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని