Vijayawada: కూల్చాల్సినోళ్లే కట్టుకోమన్నారు.. రూ.కోట్ల స్థలం ఆక్రమించిన వైకాపా నేత
ఈ చిత్రం చూశారా.. ఇదీ ఏలూరు కాలువ గట్టు. విజయవాడ మధ్య నియోజకవర్గం పూర్ణానందపేట వద్ద ఉంది. వీఎంసీ వాహన డిపో పక్కనే రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గం. ఈ రహదారి వెంట నిత్యం ఉన్నతాధికారులు సైతం పర్యటిస్తుంటారు.
అనుమతిచ్చి మరీ అధికారుల సహకారం
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అనుచరుడినని హల్చల్
ఏలూరు కాలువ కట్టను ఆక్రమించి మరీ నిర్మాణం
ఈనాడు - అమరావతి: ఈ చిత్రం చూశారా.. ఇదీ ఏలూరు కాలువ గట్టు. విజయవాడ మధ్య నియోజకవర్గం పూర్ణానందపేట వద్ద ఉంది. వీఎంసీ వాహన డిపో పక్కనే రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గం. ఈ రహదారి వెంట నిత్యం ఉన్నతాధికారులు సైతం పర్యటిస్తుంటారు. ఇక్కడ ఓ వ్యక్తి కాలువగట్టును ఆక్రమించి పట్టపగలే శాశ్వత నిర్మాణం చేసేశారు. ఆయన వైకాపా ఎమ్మెల్సీ ముఖ్య అనుచరుడు. దాదాపు 200 గజాల స్థలం ఆక్రమించి భవనం నిర్మించారు. పైన ట్యాంకు కూడా కట్టేశారు. ఇటు నగరపాలక అధికారులు కానీ.. అటు జల వనరుల శాఖ అధికారులు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కారణం.. ఆయన ఎమ్మెల్సీ అనుచరుడు. అంతేకాదు.. సెంట్రల్ వైకాపా ఇన్ఛార్జిగా పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ను ప్రకటించిన వెంటనే ఈ ఆక్రమణకు, అక్రమ కట్టడానికి శ్రీకారం చుట్టారు.
ఏలూరు కాలువ కట్ట మీద ఆక్రమించి భవనం నిర్మిస్తుంటే.. కొందరు జలవనరుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పలుగు పారతో తొలగించేందుకు వచ్చారు. అంతే కమిషనర్కు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వచ్చింది. ‘ఆయన మా కార్యకర్త. అక్కడ నుంచి వెళ్లండి.. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. ఆయన అడిగిన కుళాయి కనెక్షను ఇవ్వండని’ ఆదేశాలు. మాజీ మంత్రి, వీఎంసీ ముఖ్య ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ ఒత్తిడి చేస్తే వీఎంసీ అధికారులు తోకముడిచారు. జలవనరుల శాఖ అధికారులు అసలు నోరు విప్పలేదు.
రూ.లక్షలు చేతులు మారాయి...
విజయవాడ నగరంలో ఆక్రమణలు తొలగించి వారికి వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించారు. కాలువల సుందరీకరణకు వీఎంసీ చర్యలు తీసుకుంటోంది. అలాంటిది.. నగరం నడిబొడ్డున వాణిజ్య ప్రాంతమైన పూర్ణానందపేటలో ఏలూరు కాలువను యథేచ్ఛగా ఆక్రమించేశారు. అక్కడ ఫెన్సింగ్ ఉన్నా.. ఆక్రమణదారులను అడ్డుకోలేక పోయింది. ఫెన్సింగ్ దాటి గ్రీన్ మ్యాట్లు కట్టి మరీ నిర్మాణం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే.. అడ్డుకోకపోగా.. నీటి కుళాయి ఇచ్చి మరీ సహకరించారు. దీని వెనుక చాలా తతంగం నడిచింది. రూ.లక్షల్లో చేతులు మారాయని తెలిసింది. జలవనరుల శాఖకు చెందిన గత ఎస్ఈ నరసింహమూర్తి ఆక్రమణలపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందించారు. ఆక్రమించి అద్దెలకు ఇస్తున్న నేతల జాబితాను పంపారు. ఈ నివేదిక పక్కన పెట్టారు. జలవనరుల శాఖ స్థలాలు ఆక్రమించి కల్యాణ మండపాలు కట్టేశారు. సామాజిక భవనాల పేరుతో నిర్మాణాలు చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. తాజాగా ఓ ముఖ్య నాయకుడి అండతో ఆక్రమించడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్సీ స్టిక్కర్ వాహనంతో ఆక్రమణ ప్రదేశంలో ఇలా..
రమారమి.. రూ.2 కోట్లు!
ఈ వైకాపా నేత ఆక్రమించి నిర్మించిన చోట.. గజం మార్కెట్ విలువ రూ.లక్ష వరకు ఉంది. మొత్తం 200 గజాల స్థలం.. కనీసం రూ.2 కోట్లు ఉంటుంది. దీనికి భవన నిర్మాణ అనుమతి లేదు. విద్యుత్తు కనెక్షను ఇచ్చారు. ఏకంగా నగరపాలక అధికారులు కుళాయి కనెక్షన్ దగ్గరుండి ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆక్రమణ, అక్రమ భవన నిర్మాణం చేసిన వ్యక్తి గతంలో ఎమ్మెల్సీ వాహనంతో రోడ్డు ప్రమాదానికి కారణమై ఓ యువకుడి ప్రాణం బలిగొన్నాడు. నాడు ఎమ్మెల్సీ వాహనం కాదని తప్పించారు. కేసులను మసిపూసి మారేడు కాయ చేశారు. అదే వ్యక్తి ఇప్పుడు తాను కొనుగోలు చేసిన కొత్త వాహనానికి ఎమ్మెల్సీ స్టిక్కర్ అంటించి మరీ తిరుగుతున్నారు. ఈవాహనంలోనే నిర్మాణ భవనం వద్ద పర్యవేక్షిస్తూ.. తను ఎమ్మెల్సీ మనిషిని అని బెదిరిస్తున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. గతంలో ఆయన ఆక్రమణ నివారించినట్లు తెలిసింది. వెలంపల్లి సెంట్రల్ ఇన్ఛార్జి కాగానే అక్రమ భవన నిర్మాణం పూర్తయింది. వెలంపల్లితో సెంట్రల్లో ప్రచారంలో పాల్గొంటుండగా ఆయనకు గజమాలలు వేసి ఈయన తన కృతజ్ఞత చాటుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం