చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు
రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో 76 మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఆంధ్రా ఆసుపత్రి చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పి.వి.రామారావు, రోటరీ జిల్లా 3020 గవర్నర్ రావూరి సుబ్బారావులు తెలిపారు.
పి.వి.రామారావుకు చెక్కు ఇస్తున్న రావూరి సుబ్బారావు, జి.వి.మోహన్ప్రసాద్, కంచెల రవికుమార్
సూర్యారావుపేట, న్యూస్టుడే : రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో 76 మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఆంధ్రా ఆసుపత్రి చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పి.వి.రామారావు, రోటరీ జిల్లా 3020 గవర్నర్ రావూరి సుబ్బారావులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఆంధ్రా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఆంధ్రా ఆసుపత్రి హార్ట్ అండ్ బ్రెయిన్లో.. శస్త్రచికిత్సల ప్రాజెక్టును ప్రారంభించారు. డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ గత 80 సంవత్సరాలుగా సేవలు అందిస్తోందని తెలిపారు. వైద్యం, విద్య, వృత్తి, ఆర్థిక రంగాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు సాయం అందిస్తోందని తెలిపారు. రావూరి సుబ్బారావు మాట్లాడుతూ.. రోటరీ అంతర్జాతీయ సంస్థ వైద్య సేవలకు సంబంధించి నిధులు సమకూర్చడంలో ముందుంటుందని తెలిపారు. సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్కు వ్యతిరేకంగా విస్తృతమైన ప్రచారం చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రధానంగా యువతలో ఆత్మహత్య ఆలోచనలు తొలగించడమే తమ ప్రధాన కార్యక్రమం అని వివరించారు. రోటరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విజయవాడ సభ్యుడు దివంగత కరిణి చంటిరాజు సేవలను స్మరించుకున్నారు. రోటరీ సభ్యులు 76 మంది పిల్లల శస్త్రచికిత్సలకు అవసరమైన రూ.65.22 లక్షల చెక్కును డాక్టర్ పి.వి.రామారావు తదితరులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దిలీప్, విక్రం, జె.శ్రీమన్నారాయణ, రోటరీ ప్రాజెక్టు ఛైర్మన్ డాక్టర్ జి.వి.మోహన్ప్రసాద్, కంచెల రవికుమార్, కరిణి హేలి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం