యువతా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో..
యువత ఓటు విలువ తెలుసుకుని సార్వత్రిక ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కొత్తా మాధవి సూచించారు.
ఓటు నమోదు, చైతన్య సదస్సులో ఆర్డీవో మాధవి సూచన
విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న ఆర్డీవో మాధవి. వేదికపై ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, అధ్యాపకుడు రాంబాబు
తిరువూరు, న్యూస్టుడే: యువత ఓటు విలువ తెలుసుకుని సార్వత్రిక ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కొత్తా మాధవి సూచించారు. స్థానిక ఎస్ఎల్ఆర్ ప్రతిభ మోడల్ డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు నమోదు, చైతన్య సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోకపోతే బీఎల్వోను సంప్రదించాలని, లేనిపక్షంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సమర్థులను ఎన్నుకోవడంలో యువత కీలకపాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటాలని తెలిపారు. ప్రిన్సిపల్ ఎల్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే వజ్రాయుధంలాంటి ఓటు ప్రజల చేతుల్లో ఉందని తెలిపారు. ఓటు వేయడమే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. అధ్యాపకుడు రాంబాబు మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందన్నారు.
విలువ తెలిసింది..
- బి.సైలు
18 ఏళ్లు నిండిన వారు ఎలా ఓటు నమోదు చేసుకోవాలనే విషయంపై సదస్సు ద్వారా అవగాహన కలిగింది. ఓటు విలువ ఏమిటో ఆర్డీవోగారు, అధ్యాపకులు చక్కగా వివరించారు.
అందరినీ చైతన్యపరుస్తా..
- డి.కోటేశ్వరరావు
మా ఊరిలో ప్రతి ఒక్కరికి ఓటు విలువ తెలియజేస్తా. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఐదేళ్ల ప్రజల భవితవ్యం తేల్చే ఎన్నికల్లో ఓటు కీలకం. ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు వేస్తా.
వాగ్దానాలు నెరవేర్చిన వారికే..
- సీహెచ్ చెన్నకేశవ
వాగ్దానాలు నెరవేర్చిన వారికే ఓటు వేస్తా. ఉద్యోగావకాశాలు కల్పించే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. సంక్షేమం, అభివృద్ధి సమర్థవంతంగా అమలు చేసే వారినే ఎన్నుకునేలా చైతన్యం తీసుకువస్తా.
మంచి వ్యక్తులకే ప్రాధాన్యం
- టి.కల్కిసాహితి
ఓటు హక్కును సమర్థంగా వినియోగించడంలో యువత ముందుండాలి. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా మంచి వ్యక్తులను చట్టసభలకు పంపించాల్సిన అవసరం ఉంది. నేను నా ఓటు హక్కును వినియోగించుకుంటాను.
ప్రలోభాలకు లొంగకూడదు
- సీహెచ్ దివ్య
ఎన్నికలప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలకు గురిచేయడం, తాయిలాలు పంచడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటికి ఓటర్లు దూరంగా ఉండాలి. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే యువత అడ్డుకోవాలి.
ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదం
- వైవీవీఎస్ కృష్ణప్రసాద్
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధమనే విషయం ఈ సదస్సు ద్వారా తెలుసుకున్నాను. ఓటుతోనే సుస్థిర పాలన, శాశ్వత అభివృద్ధి సాధ్యపడుతుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్