ప్రాణం తీసిన ఓపెన్ డ్రెయిన్
రోజూ రాత్రి 9 గంటల కల్లా ఇంటికి వచ్చే కుటుంబ యజమాని రాకపోవడంతో ఇంటిల్లిపాది ఆందోళనకు గురయ్యారు. తెల్లారిన తర్వాత..
మురుగు కాలువలో పడి ఆటోడ్రైవర్ మృతి
కదిరి అప్పన్న (పాతచిత్రం): మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
అజిత్సింగ్నగర్ (మధురానగర్), న్యూస్టుడే : రోజూ రాత్రి 9 గంటల కల్లా ఇంటికి వచ్చే కుటుంబ యజమాని రాకపోవడంతో ఇంటిల్లిపాది ఆందోళనకు గురయ్యారు. తెల్లారిన తర్వాత.. ఇంటికి కిలోమీటరు దూరంలోనే విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. చూపరులను సైతం కంటతడి పెట్టించిన ఈ ఘటన.. వాంబేకాలనీలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వాంబేకాలనీ సి బ్లాక్, 10 నంబరు ఫ్లాట్లో కదిరి అప్పన్న (47) నివసిస్తున్నారు. ఆయన ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. అప్పన్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఒక అమ్మాయికి వివాహం చేశారు. ప్రతి రోజూ కిరాయికు వెళ్లి, రాత్రి 9 గంటల కల్లా ఇంట్లో ఉంటారు. బుధవారం రాత్రి 11 గంటలైనా రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనచెందారు. ఆయనకి ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం ఉదయం వాంబేకాలనీ రోడ్డులోని ఓపెన్ డ్రెయిన్లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లారు. చనిపోయింది తన భర్తే అని గుర్తించిన భార్య కాంతమ్మ రోధించింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. నున్న పోలీసులు వచ్చి విచారించారు. కాలువలో జారిపడిపోయి ఉండొచ్చని, రాత్రి వేళ ఎవరూ గమనించలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
నగరపాలక సంస్థ వైఫల్యం
నగరపాలక సంస్థ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్.బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఇతర నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోతైన డ్రెయిన్ల వద్ద రక్షణ చర్యలు లేవని, సిమెంటు దిమ్మెలు వేయాలని పేర్కొన్నారు. గతంలో ఇదే డ్రెయిన్లో పడి పలువురు మృతి చెందారని.. 15 రోజుల క్రితం ఓ వృద్ధుడు మరణించారని స్థానికులు చెబుతున్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా నగరపాలకసంస్థ రక్షణ చర్యలు చేపట్టకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానవాటిక వద్ద వామపక్ష నాయకులు ధర్నా చేశారు. ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి