నామినేషన్ల వరకు.. నమోదుకు గడువు
సాధారణ ఎన్నికల ప్రకటన (షెడ్యూల్) విడుదల చేసే వరకు ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలన చేసి తప్పులను సరిదిద్దుతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు వెల్లడించారు.
ప్రకటన వచ్చేదాకా ఓటరు జాబితాల్లో సవరణ
‘ఈనాడు’తో జిల్లా కలెక్టరు డిల్లీరావు
ఈనాడు, అమరావతి: సాధారణ ఎన్నికల ప్రకటన (షెడ్యూల్) విడుదల చేసే వరకు ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలన చేసి తప్పులను సరిదిద్దుతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో మానవ తప్పిదాలు దొర్లితే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర పొరపాట్లను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా జవాబుదారి తనంతో రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. జాబితా సవరణపై ఆయన గురువారం ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు. సాధారణ ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. వివరాలు కలెక్టర్ మాటల్లోనే..!
మార్పులు చేర్పులు..!
జిల్లాలో గత నెల ప్రకటించిన ఓటర్ల జాబితాను అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాం. ప్రతి వారం జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రాజకీయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి నివృత్తి చేసుకుంటున్నాం. తప్పులను గుర్తించి సరిదిద్దాలని పౌరులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫారం 6తో పాటు ఫారం7, ఫారం 8 స్వీకరిస్తున్నాం. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. నియోజకవర్గాల్లో తప్పులు కనిపిస్తున్నాయి. జిల్లాలో గత నెల ప్రకటించిన తుది జాబితాలో 16.75లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంతకుముందు జాబితాతో పోల్చితే 2.19 శాతం ఓటర్లు పెరిగారు. కొన్ని నియోజకవర్గాల్లో అచ్చుతప్పులు, మృతుల పేర్లు తొలగించకపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. దీనికి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడం, ఇంటికి వచ్చిన బీఎల్వోలకు ఇరుగుపొరుగు వారు సమాచారం ఇవ్వకపోవడం కారణాలు కావచ్చు. షెడ్యూలు వచ్చేవరకు ఫారం 7 స్వీకరించి వాటిని పరిష్కరిస్తాం. కొత్త ఓటర్లకు ఫారం 6 అవకాశం నామినేషన్ల వరకు ఉంటుంది. మార్పుల ఫారం 8 కూడా నామినేషన్ల వరకు తీసుకుని పరిష్కరిస్తాం.
ప్రత్యేక విభాగం..
ఓటర్ల జాబితాపై అందిన ఫిర్యాదులు, దరఖాస్తులపై ప్రత్యేక విభాగాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేశాం. వాటిని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి పరిష్కరిస్తున్నాం. ప్రతివారం నిర్వహించే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాల్లో వచ్చే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటున్నాం. పొరపాట్లు జరిగిన ప్రాంతాల్లో బీఎల్వోలను జవాబుదారీగా గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఒక నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ఓటర్లు మరో నియోజకవర్గంలోకి వలస వస్తున్నారన్న విషయంలో వాస్తవం లేదు.
కొత్త ఓటర్లపై దృష్టి..
అర్హుత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటింటికీ బీఎల్ఓలు తిరిగి ఓటు లేని వారి వివరాలు సేకరించారు. ఫారం 6 ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు ఆయా కళాశాలలకు బీఎల్వోలను పంపించి దరఖాస్తులు చేయించాం. వీరులపాడు మండలంలో కొందరికి సరిహద్దుగా ఉన్న తెలంగాణలోనూ ఓటు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో గుర్తించి వాటిని తొలగించాం. స్థానికంగా నివాసం ఉన్నవారికే ఓటు ఉంచాం. షెడ్యూల్ విడుదలైన తర్వాత వెబ్సైట్లో సరిదిద్దిన జాబితా ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి వివరాలు అనుబంధ జాబితాలో ఉంటాయి.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం చర్యలు
జాబితాలో కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పులకు కారణమైన వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. నియోజకవర్గ ఎన్నికల అధికారులు, సహాయ అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తయింది. వీలైనంతవరకు సమీపంలోనే ఉండేలా ఏర్పాట్లు చేశాం. పాఠశాలల అందుబాటు, వసతులు పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాం. ఎన్నికల సామగ్రి సిద్ధం చేస్తున్నాం. ఈవీఎంలను గోదాముల్లో భద్రపరిచాం. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం నింపేందుకు ర్యాలీలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం