‘నిఘా’ నిద్దరోతోంది...!
ప్రతిపక్షాల నిరసనలు, శాంతియుత ఆందోళనల అణచివేతపై పోలీసులకు ఉన్న శ్రద్ధ.. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచడంలో కరవైంది. ఈ ఉదాసీనత అంతిమంగా ఘర్షణలు, హత్యలకు దారి తీస్తోంది.
గ్యాంగ్ వార్లకు దారితీస్తున్న చిన్న వివాదాలు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, పటమట
ప్రతిపక్షాల నిరసనలు, శాంతియుత ఆందోళనల అణచివేతపై పోలీసులకు ఉన్న శ్రద్ధ.. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచడంలో కరవైంది. ఈ ఉదాసీనత అంతిమంగా ఘర్షణలు, హత్యలకు దారి తీస్తోంది. తొలి దశలోనే వీటిని నివారించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కీలక ప్రాంతాల్లో గస్తీ లేకపోవడం, పటిష్ట నిఘా కొరవడడమే ఇందుకు ప్రధాన కారణం. ఏదైనా ఘటనలు జరిగినపుడే హడావుడి చేయడం.. పరిపాటిగా మారింది. తాజాగా హైటెన్షన్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన రెండు వర్గాల యువకుల గొడవే ఇందుకు నిదర్శనం. కానూరులోని ఓ కాలేజీకి చెందిన జూనియర్లు, సీనియర్ల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం రాడ్లు, కర్రలతో నడిరోడ్డుపై బాహాబాహీకి దిగే వరకు వెళ్లింది.
శాంతి, భద్రతల పరంగా విజయవాడ నగరం చాలా సున్నితమైంది. ఇక్కడ పలు రకాల నేరాలు జరుగుతుంటాయి. ఇంతటి కీలకమైన చోట శాంతి, భద్రతలు పూర్తి స్థాయిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను రూపుమాపాలంటే పటిష్ట నిఘా అవసరం. నగర పరిధిలోని స్టేషన్లలో ఎస్సైలకు వాహనాలు లేకపోవడం వల్ల గస్తీ తగ్గుతోంది. రక్షక్లను ప్రధానంగా రాత్రి పూట గస్తీకి వాడుతున్నారు. ప్రతి స్టేషన్కు అదనంగా కనీసం రెండు జీపులు అయినా ఇస్తేనే క్షేత్రస్థాయిలో వారు పట్టు సంపాదించేందుకు వీలు కలుగుతుంది. స్టేషనుకు ఇచ్చిన ఒక్క రక్షక్ వాహనాన్ని అందరు ఎస్సైలు వినియోగించుకోలేని పరిస్థితి. ద్విచక్ర వాహనాలపై తమ ప్రాంతాల్లో తూతూమంత్రంగా తిరుగుతున్నారు. దీని వల్ల అంతిమంగా పోలీసుల సమాచార వ్యవస్థ దెబ్బతింటోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పలు కేసుల్లో సరైన సమయంలో సమాచారం రాకపోవడం వల్ల పెద్దవయ్యాయి. వివాదాన్ని ప్రారంభంలోనే గుర్తించకపోవడంతో అవి చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టడం, ఇన్ఫార్మర్ వ్యవస్థను మెరుగుపర్చుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.
ఏడాదిన్నర కిందట.. సింగ్నగర్కు చెందిన టోనీ అనే రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసేందుకు అతని అనుచరులు ప్రభ, ఆకాశ్, తదితరులు వచ్చారు. అనంతరం పటమట స్టేషన్ పరిధిలోని ఓ బార్లో అందరూ కలిసి మద్యం తాగారు. తాగిన మైకంలో ఫుట్బాల్ ఆటగాడు అయిన ఆకాశ్, ప్రభ మధ్య గొడవ జరిగింది. ఇది పెరిగి పెద్దది అయింది. మద్యం సీసా పగులగొట్టి ప్రభపై ఆకాశ్ దాడి చేయగా చేతికి గాయాలయ్యాయి. ఇది జరిగిన అనంతరం అదే రోజు రాత్రి ఆకాశ్ ఉన్న గదికి ప్రభ తన అనుచరులతో వెళ్లి హత్య చేశాడు.
చినికి చినికి గాలివానగా..
రెండేళ్ల కిందట పటమట స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో రెండు వర్గాలు పట్టపగలే పరస్పరం ఘర్షణకు దిగాయి. దాదాపు 60 మంది పాల్గొని ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. జనావాసాల మధ్యన ఇది జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. గాయపడిన వారు కేసు పెట్టిన తర్వాతే పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఘర్షణ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన తర్వాతే పోలీసులు అప్రమత్తమయ్యారు. అదే రోజు ఉదయం చిన్న వంతెన ప్రాంతంలో ఓ వర్గం సమావేశమైంది. అటుగా పోలీసులు వాహనం వెళ్తుండడంతో వారు చెల్లాచెదురయ్యారు. ఆ సమయంలో పసిగట్టకపోవడంతో రెండు వర్గాలు దాడి చేసుకుని, ఒకరి ప్రాణం పోయేంత వరకు వెళ్లింది.
పరిధి పెరిగి.. పర్యవేక్షణ కొరవడి
నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లు స్టేషన్లు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న వాటిపై కేసుల భారం అధికమవుతోంది. ఫలితంగా పర్యవేక్షణ కొరవడుతోంది. కీలకమైన పటమట పోలీస్స్టేషన్ పరిధి కూడా నలువైపులా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. బెంజిసర్కిల్ నుంచి అశోక్నగర్ వరకు, జాతీయ రహదారి వెంబడి స్క్యూ బ్రిడ్జి నుంచి గూడవల్లి వరకు విస్తరించింది. ఈ ప్రాంతంలో ఆవాస ప్రాంతాలు, కాలనీలు ఎక్కువ. దీనికి తోడు వైట్కాలర్, ఆర్థిక నేరాలు అధికంగా నమోదు అవుతుంటాయి. దీన్ని విభజించాలన్న ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి ప్రాంతాలు స్టేషన్ నుంచి చాలా దూరంలో ఉంటాయి. పెద్ద స్టేషన్లను విభజించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి