తెలుగు భాషాభ్యున్నతికి పాటుపడతాం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సభ శనివారం రాత్రి విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు.
మాట్లాడుతున్న సామల రమేష్బాబు, వేదికపై బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ తదితరులు
మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్టుడే : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సభ శనివారం రాత్రి విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాతృ భాషాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషలో చదివే వారి సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు సామల రమేష్బాబు, అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.... దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిర పడిన వారందరూ తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారేనని తెలియజేశారు. తెలుగు భాషాభ్యున్నతికి పాలకులు తీసుకోవాల్సిన చర్యలను భాషా ఉద్యమనేత డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ వివరించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... రాజ్యాంగం 22 జాతీయ భాషలను గుర్తిస్తే.. కేవలం హిందీకే ప్రాధాన్యం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు భాషాతోనే వికాసమని జనసేన నాయకుడు పోతిన మహేష్, కాంగ్రెస్ నాయకుడు కొలనుకొండ శివాజీ తెలిపారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి మొవ్వ శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన ఐదు తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. తెలుగు అభివృద్ధి, ప్రాధికార సంస్థను స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేయాలి. తెలుగును అధికార భాషగా అన్ని సంస్థల్లో అమలు చేయాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులో పనిచేసే కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. తెలుగు ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేందుకు అవసరమైన రాజ్యాంగ హక్కులకు రాజకీయ పార్టీలన్ని మద్దతు ప్రకటించాలి అని తీర్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్