వైకాపా గుండెలు జారిపోయాయి
జనసేన, తెదేపా కూటమి తొలి జాబితా ప్రకటనకే వైకాపా గుండెలు జారిపోయాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మొఘల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు. పక్కన వంశీకృష్ణ, సాంబశివరావు, సాయిరామ్గౌడ్ తదితరులు
మొఘల్రాజపురం (చుట్టుగుంట), న్యూస్టుడే : జనసేన, తెదేపా కూటమి తొలి జాబితా ప్రకటనకే వైకాపా గుండెలు జారిపోయాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మొఘల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. మధ్య నియోజకవర్గ అభ్యర్థిగా ఉమా పేరును ప్రకటించడంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపాకు ఓటమి భయం పట్టుకుందన్నారు. వై నాట్ 175 అన్న జగన్.. అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా? అని ప్రశ్నించారు. సొంత మనుషులే జగన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీ టికెట్ వద్దు.. నీ పార్టీ వద్దు.. అని చాలా మంది నాయకులు వెళ్లిపోతున్నారన్నారు. 2014లో తెదేపా, భాజపా, జనసేన కలిసి పోటీ చేశామన్నారు. 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తెదేపా పలు మార్లు పొత్తులు పెట్టుకుందన్నారు. జగన్లా చీకటి పొత్తులు పెట్టుకోలేదన్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అని పవన్ ఎప్పుడో చెప్పారన్నారు. మేం పొత్తు పెట్టుకుంటే.. వైకాపా నాయకులకు వచ్చిన నొప్పి ఏమిటని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ గజగజ వణికిపోతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి తల్లకిందులైందన్నారు. పశ్చిమలో అవినీతి చేసిన మాజీ మంత్రి వెలంపల్లిని సెంట్రల్కి బదిలీ చేశారన్నారు. టికెట్ ప్రకటించక ముందే చందాలు ప్రారంభించారని ఆరోపించారు. చందాల శ్రీను సెంట్రల్లో దందాలు మొదలుపెట్టారని, ఇప్పటి వరకు ఇలాంటి వ్యక్తిని చూడలేదని ప్రజలు వాపోతున్నారన్నారు. రైతు బజారులో ఒక్కో దుకాణం నుంచి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నారని, లేకుంటే పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు వ్యాపారులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. అధికారులు అనవసరంగా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగవద్దని, భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరామ్ గౌడ్, జనసేన నియోజకర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల