చోడవరంలో అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
చోడవరం ఇసుక క్వారీలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ గత నాలుగు రోజులుగా భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్న పెనమలూరు మాజీ శాసన సభ్యుడు బోడే ప్రసాద్, తెదేపా కార్యకర్తలు శనివారం అర్ధరాత్రి క్వారీలోకి చేరుకొని ఆందోళనకు దిగారు
అడ్డుకున్న బోడే ప్రసాద్, తెదేపా నాయకులు
క్వారీలో ఇసుక తవ్వుతున్న పొక్లెయిన్ను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్
పెనమలూరు, న్యూస్టుడే: చోడవరం ఇసుక క్వారీలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ గత నాలుగు రోజులుగా భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్న పెనమలూరు మాజీ శాసన సభ్యుడు బోడే ప్రసాద్, తెదేపా కార్యకర్తలు శనివారం అర్ధరాత్రి క్వారీలోకి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో తవ్వకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యేతో పాటు దాదాపు 100 మంది తెదేపా కార్యకర్తలు ఉన్నట్టుండి క్వారీకి వెళ్లి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్లను అడ్డుకోగా.. డ్రైవర్లు, సిబ్బంది పరారయ్యారు. లారీలు కరకట్టపై నిలిచిపోయాయి. తవ్వకాలపై ఆర్డీవో రాజు, పోలీస్ అధికారులకు బోడే ప్రసాద్ అక్కడ నుంచే ఫిర్యాదు చేయగా తమ శాఖ పరిధిలోది కాదంటే.. తమ శాఖది కాదని తప్పించుకోవడంతో బోడే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ అండతో ఆయన అనుచరులు క్వారీపై పడి అడ్డంగా దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. దోపిడీలో మంత్రితో పాటు మైనింగ్ ఉన్నతాధికారి వెంకటరెడ్డికి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇసుక తవ్వకాలకు పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే అక్రమ తవ్వకాలతో రూ.కోట్ల విలువైన ఇసుకను తరలించేస్తున్నారంటూ వెంకటరెడ్డికి పలుసార్లు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోను క్వారీ నుంచి ఇసుక అక్రమంగా తవ్వి తరలిస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై తమవద్ద ఉన్న సాక్ష్యాలతో న్యాయస్థానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?