వైకాపా నాయకుల ఇసుక దోపిడీ
అడిగేవారు, అడ్డుకునేవారు లేరని.. అధికారం ఉందని ఇసుకాసురులు కృష్ణా నదిని చెరపట్టారు. అధికారులు కూడా చోద్యం చూస్తుండడంతో నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు
అక్రమ రవాణా అడ్డుకున్న గ్రామస్థులు
లారీలు అడ్డుకున్న రొయ్యూరువాసులు
తోట్లవల్లూరు, న్యూస్టుడే: అడిగేవారు, అడ్డుకునేవారు లేరని.. అధికారం ఉందని ఇసుకాసురులు కృష్ణా నదిని చెరపట్టారు. అధికారులు కూడా చోద్యం చూస్తుండడంతో నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను సైతం ధిక్కరించి నదీగర్భంలోని ఇసుక తోడేస్తున్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పలుచోట్ల ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. గనులు, పర్యావరణ, రెవెన్యూ, పోలీసు, నిఘా విభాగాల కళ్లెదుటే అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నందున చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
రైతు పేరుతో అనుమతులు తిరస్కరించినా..
తోట్లవల్లూరు మండలం రొయ్యూరు క్వారీలో ఓ రైతు పేరుతో సుమారు 4.9 ఎకరాల్లో ఇసుక తవ్వకాల కోసం దరఖాస్తు చేయగా అనుమతులిచ్చేందుకు అధికారులు తిరస్కరించారు. అయినా దీన్ని అడ్డం పెట్టుకొని మంత్రి, నియోజకవర్గ నేత సహకారంతో ప్రభుత్వ క్వారీలో తవ్వకాలు చేపట్టి రాత్రింబవళ్లు రవాణా చేస్తున్నారు. తను చెప్పిందే చట్టం అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. భారీ పొక్లెయిన్లతో నిత్యం వందలాది లారీలతో ఇసుక తరలిస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు. స్థానికంగా ఉన్న వైకాపా నాయకుల అనుచరులు వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారి అరాచకాలు శ్రుతిమించి భారీ లారీల రాకపోకలకు రహదారులు ధ్వంసం కావడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో లారీలను అడ్డుకున్నారు.
స్పందించని యంత్రాంగం
రొయ్యూరు గ్రామానికి చెందిన ఎం.రాంబాబు, నాగరాజు తదితరులు శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి లారీలను అడ్డుకున్నారు. గ్రామస్థులు శనివారం మధ్యాహ్నం వరకు అడ్డుకున్నాగానీ అధికారులు రాలేదు. రెవెన్యూ అధికారులు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. 45 రోజుల నుంచి అడ్డగోలుగా ఇసుక తవ్వుకుపోతున్నారన్నారు. రొయ్యూరు క్వారీకి ఎటువంటి అనుమతులు లేవని తహసీల్దార్ ఎం.కుసుమకుమారి చెప్పారు. అక్రమ తవ్వకాలపై ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?