‘పేర్ని నాని ఆత్మవిమర్శ చేసుకోవాలి’
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అక్రమంగా కుమారుడికి కట్టబెట్టి అక్రమాలకు ఆజ్యం పోసిన ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ తెదేపా నాయకులు హితవు పలికారు.
మాట్లాడుతున్న తెదేపా నాయకులు
మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్టుడే: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అక్రమంగా కుమారుడికి కట్టబెట్టి అక్రమాలకు ఆజ్యం పోసిన ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ తెదేపా నాయకులు హితవు పలికారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గోపు సత్యనారాయణ, కుంచె నాని, లంకె నారాయణ ప్రసాద్లు మాట్లాడుతూ రెండేళ్లకే మంత్రి పదవి పోగొట్టుకున్న పేర్ని ఇక ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోతుండటాన్ని జీర్ణించుకోలేక ఇంకా అబద్ధాలతోనే ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం అవివేకమన్నారు. కొల్లు రవీంద్ర వేసిన శిలాఫలకాలను అపహాస్యం చేసేలా చూపిస్తున్న పేర్ని తాను అక్రమ సంపాదనతో నిర్మించిన గోదామును చూపిస్తే బాగుంటుందన్నారు. దొంగ పట్టాలతో అమాయకులైన పేద వర్గాలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. గతంలో గోగిలేరుకు పోర్టును తాకట్టు పెట్టి, ఇప్పడేదో మాయ పనులతో పోర్టు కట్టేస్తున్నామంటూ ప్రగల్భాలు పలకడం హేయమన్నారు. కేవలం అక్రమాల కోసమే పోర్టు పనులు చేస్తున్నారని, దాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే చిత్తశుద్ధి వైకాపా ప్రభుత్వానికి లేదన్న విషయం జరుగుతున్న పనులను చూస్తే ఎవరికైనా అర్ధమవుతుందన్నారు. ‘మీ కొడుకు ముడ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడంటూ చెప్పుకోవడం కన్నా గతిమాలిన పని మరోటి లేదని’ అన్నారు. గతంలో పోర్టు పనులను నవయుగ సంస్థకు అప్పగించి మళ్లీ ఆ సంస్థ పనిచేయకుండా పనులు రద్దు చేయించింది తమరే అన్న విషయం అందరికీ తెలుసన్నారు. సమన్వయ కమిటీ నాయకులు వాలిశెట్టి తిరుమలరావు, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ఖాజాలు మాట్లాడుతూ నాని అబద్ధాలతో కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలనే కుతంత్రాలు మానుకుంటే మేలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే