గన్నవరం నుంచి శాసనసభలో అడుగు పెడతా
తెదేపాకు కంచుకోట వంటి గన్నవరం నియోజకవర్గంలో గెలిచి నారా భువనేశ్వరికి కానుకగా అందిస్తానని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: తెదేపాకు కంచుకోట వంటి గన్నవరం నియోజకవర్గంలో గెలిచి నారా భువనేశ్వరికి కానుకగా అందిస్తానని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం తెదేపా-జనసేన మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో, గన్నవరం తెదేపా సీటుని యార్లగడ్డకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటించగానే పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఆ సమయంలో హనుమాన్జంక్షన్లోనే ఉన్న ఆయన స్థానిక అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, తనపై నమ్మకంతో చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్ సీటు ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గన్నవరం నుంచి శాసనసభకు వస్తానని సీఎం జగన్తో సవాల్ చేశానని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరతానన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అండదండలు తనకు ఉన్నాయన్నారు. జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, నాయకులు వేగిరెడ్డి పాపారావు, గుండపనేని ఉమాప్రసాద్, మూల్పూరి కల్యాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వీరవల్లి వద్ద యార్లగడ్డను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం
మచిలీపట్నం, కార్పొరేషన్ : మచిలీపట్నం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్రను పార్టీ అధిష్టానం ప్రకటించిన అనంతరం నగరానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బందరు మండంలోని సుల్తాన నగరం గ్రామం వద్ద నాయకులు ఆయన్ను గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి నగరంలోని ఆయన ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు రవీంద్ర అభివాదం చేస్తూ..మాట్లాడుతూ వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం