టిడ్కో ఇళ్ల మంజూరులో నకి‘లీలలు’
గుడివాడ టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో కొత్త బాగోతం వెలుగుచూసింది. విద్యుత్తు కనెక్షన్లున్నవారికి మంజూరు రద్దు చేయడంతో వారంతా వక్రమార్గం పట్టారు.
విద్యుత్తు శాఖ అధికారుల సంతకాలు ఫోర్జరీ
దొంగ స్టాంపులతో ధ్రువపత్రాల సృష్టి
ఓ లబ్ధిదారుని పేరుతో సృష్టించిన నకిలీ ధ్రువపత్రం
న్యూస్టుడే, గుడివాడ (నెహ్రూచౌక్): గుడివాడ టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో కొత్త బాగోతం వెలుగుచూసింది. విద్యుత్తు కనెక్షన్లున్నవారికి మంజూరు రద్దు చేయడంతో వారంతా వక్రమార్గం పట్టారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులతో నిరభ్యంతర పత్రాలు సృష్టించి ఇళ్ల కేటాయింపులు పొందుతున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో సచివాలయాల సిబ్బంది జోక్యంతో ఈ దందా కొనసాగుతోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇళ్లు లేని పేదల కోసం గుడివాడ పట్టణానికి సమీపంలోని మల్లాయపాలెంలో టిడ్కో ఇళ్ల సముదాయం నిర్మించారు. ఇందులో ఇల్లు మంజూరు కావాలంటే దరఖాస్తుదారుడి పేరుతో విద్యుత్తు కనెక్షన్ ఉండకూడదు. ఈ నిబంధన కింద కొంతమంది అర్జీల్ని తిరస్కరించారు. ఇలాంటి వారంతా అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ పేరుతో విద్యుత్తు కనెక్షన్లు లేవని సంబంధిత ఏఈల వద్ద నుంచి నో సర్వీస్ ధ్రువపత్రాన్ని సచివాలయాల్లో సమర్పించాలి. కొంతమంది మోసగాళ్లు అలాంటి వారికి ఇళ్లు వచ్చేలా చేస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. తమ పేరుతో విద్యుత్తు కనెక్షన్ లేదని.. విద్యుత్తు శాఖ ఏఈల సంతకాల్ని ఫోర్జరీ చేసి దొంగ స్టాంపులతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. స్థానిక నాయకుల కనుసన్నల్లో సచివాలయాల సిబ్బంది వాటిని అప్లోడ్ చేస్తుండడంతో ఇళ్లు మంజూరవుతున్నాయి.
పోలీసులకు ఏఈల ఫిర్యాదు
తమ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారని విద్యుత్తు శాఖ ఏఈలు శుక్రవారం రాత్రి ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని పెద్దవీధి, ధనియాలపేటలో ఈ నకిలీ పత్రాలు ఎక్కువగా సృష్టించినట్లు ఫిర్యాదులో పేర్కొనట్లు సమాచారం. ఈ అక్రమాల్లో సచివాలయ సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి అక్రమార్కుల వల్ల అర్హులు నష్టపోవాల్సి వస్తోందని, ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు తక్షణం విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
విచారణ చేపడతాం
ఈ విషయం ఇంతవరకూ మా దృష్టికి రాలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయించి రుజువైతే దోషులపై చర్యలు తీసుకుంటాం.
- కృష్ణారావు, పురపాలక సంఘం సహాయ కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్