logo

పరిపాలనా సౌలభ్యం కోసమే సచివాలయాలు

పరిపాలనా సౌలభ్యం కోసమే  సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు.

Updated : 25 Feb 2024 10:21 IST

మోపిదేవి: పరిపాలనా సౌలభ్యం కోసమే  సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. ఆదివారం మోపిదేవి మండలం పెదప్రోలు లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 43.60 లక్షలతో నూతన సచివాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలిమెట్ల ఏసుబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు ఆది రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని