జోగి తాయిలాలకు.. అడ్డేలేదు
పెనమలూరులో మంత్రి జోగి తాయిలాల పంపిణీకి అడ్డే లేకుండాపోతోంది. మొన్న పాస్టర్లతో ఆత్మీయ సమావేశం.. ఆపై వారి చేతిలో రూ.2 వేలు, ప్లాస్కులు, కుక్కర్లు పెట్టారు. దానిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు అందాయి. అధికారులు కూడా దృష్టిపెట్టామన్నారు.
తాజాగా రిసోర్స్ పర్సన్లకు కుక్కర్లు, చీరలు
పెనమలూరువైపు కన్నెత్తి చూడని అధికారులు
కానూరులో ఆర్పీలకు ఇచ్చిన కుక్కరు, చీర
ఈనాడు -అమరావతి, న్యూస్టుడే - కానూరు: పెనమలూరులో మంత్రి జోగి తాయిలాల పంపిణీకి అడ్డే లేకుండాపోతోంది. మొన్న పాస్టర్లతో ఆత్మీయ సమావేశం.. ఆపై వారి చేతిలో రూ.2 వేలు, ప్లాస్కులు, కుక్కర్లు పెట్టారు. దానిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు అందాయి. అధికారులు కూడా దృష్టిపెట్టామన్నారు. కానీ.. జోగి పంథా మారలేదు. పెనమలూరు పరిధిలో వాలంటీర్లు అందరితో సమావేశాలు పెట్టి.. సత్కారం పేరుతో గృహోపకరణాలు, డబ్బు పంచారు. దీనిపైనా తీవ్ర విమర్శలే. అయినా.. మరింత బహిరంగంగా జోగి తాయిలాల పర్వం కొనసాగుతోందే తప్ప ఆగడం లేదు. తాజాగా బుధవారం డ్వాక్రా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లకు తాయిలాలను పంచారు. కానూరులోని మన గార్డెన్స్లో ఆత్మీయ సమ్మేళనం ఉందని అందరినీ పిలిచి.. తనకు ఓట్లను వేయించాలని సూచించి, వారికి చికెన్ భోజనాలు పెట్టి మరీ.. కుక్కర్లు, చీరలను పంచారు. అయినా.. అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు.
పెనమలూరు పరిధిలో ఏ వర్గాన్నీ మంత్రివదలడం లేదు. సామాజిక వర్గాల వారీగా సమావేశమై తాయిలాలను పంచుతున్నారు. వాలంటీర్లతో మొదలు.. సచివాలయాల సిబ్బంది, డీఆర్డీఏ, డ్వాక్రా గ్రూపుల ఆర్పీల వరకు సమ్మేళనం పేరుతో పిలిచి.. భోజనాలు పెడుతున్నారు. తనకు ఓట్లు వేయించాలనీ, వైకాపా తరఫున పెనమలూరు అసెంబ్లీలో తనకు, మచిలీపట్నం ఎంపీ బరిలో నిలిచే అభ్యర్థికి.. ఓట్లు వేయాలని చెబుతూ.. కుక్కర్లు, ఫ్లాస్కులు, హాట్బాక్సులు, చీరలు.. ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున గృహోపకరణాలను కొని కొన్ని ప్రాంతాల్లో దాచినట్టు తెలుస్తోంది. తాయిలాల పంపిణీపై తీవ్ర విమర్శలు వస్తే.. గ్రామస్థాయి నేతలకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆసరా పేరుతో..
ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ సభలను ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు చేసి.. వైకాపా ప్రచారానికి వాడుకున్నారు. గతంలో మండలస్థాయి ప్రజాప్రతినిధులే ఎక్కడికక్కడ ఈ నమూనా చెక్కులను మహిళలకు ఇచ్చేవాళ్లు. కానీ.. దీనిని కూడా వేల మందితో కూడిన సభలుగా జోగి మార్చేశారు. వేల మంది మహిళలను సభలకు రప్పించి, వారికి చికెన్, బిర్యానీతో భోజనాలు పెట్టి.. దర్జాగా ప్రచారం చేసుకున్నారు. పేరుకు మాత్రమే ఇవి అధికారిక సభలు.. ఏర్పాట్లు మొత్తం అధికారులే చేసేవాళ్లు.. ప్రజాధనం వెచ్చించేవాళ్లు.. కానీ.. ప్రచారం మాత్రం వైకాపాకు చేసుకున్నారు. ఈ సభలకు కూడా డ్వాక్రా గ్రూపులకు చెందిన ప్రతి మహిళా తప్పనిసరిగా రావాల్సిందేనని నిబంధనలు పెట్టి మరీ.. రప్పించారు. మూడు, నాలుగు ఊళ్లకు ఒక సభ చొప్పున పెట్టి.. మూడు నాలుగు వేల మందిని ఒకచోటకు రప్పించి, డ్వాక్రా మహిళలందరికీ.. తాము చేర్చాల్సిన మెసేజ్ వెళ్లిపోయిందని భావించాకే.. ముగింపు పలికారు. ఆ తర్వాత.. పాస్టర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, రిసోర్స్పర్సన్లకు సమ్మేళనాల పేరుతో తాయిలాలు పంచడం ఆరంభించారు.
అందరూ రావాల్సిందే..
ఆత్మీయ సమ్మేళనాలు, సత్కారాలు, సభలకు.. జోగి రమేష్ ఎవరిని పిలిస్తే వాళ్లంతా రావాల్సిందే. కానూరులోని మన గార్డెన్స్లో ఆర్పీల కోసం బుధవారం నిర్వహించిన సమ్మేళనానికి వారిని బలవంతంగా రప్పించారు. ‘ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందేననీ... సెలవులు, అనుమతులు వంటివి ఎవరికీ ఉండవని కంకిపాడుకు చెందిన డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపీఎం) పేరుతో సామాజిక మాధ్యమాల్లో సోమవారం నుంచి మెసేజ్లు పెట్టి మరీ రప్పించారు. మొన్న వాలంటీర్లను కూడా ఇలాగే రప్పించి.. తాయిలాలు చేతిలో పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు