కొండపై లేఔట్
‘జగనన్న కాలనీకి ఇక్కడ స్థలం కేటాయించారు. కొండ ప్రాంతంగా ఎత్తుపల్లాలను సరిచేస్తున్నాం. అరకొర మట్టి ఉంటే బయట జగనన్న లేఔట్ కాలనీలకు తరలిస్తున్నాం.’ అని గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఓ వైకాపా నాయకుడు స్థానికంగా చెబుతున్న మాటలివి.
సమీపంలో మరో కొండ తవ్వుతున్న పొక్లెయిన్
‘జగనన్న కాలనీకి ఇక్కడ స్థలం కేటాయించారు. కొండ ప్రాంతంగా ఎత్తుపల్లాలను సరిచేస్తున్నాం. అరకొర మట్టి ఉంటే బయట జగనన్న లేఔట్ కాలనీలకు తరలిస్తున్నాం.’ అని గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఓ వైకాపా నాయకుడు స్థానికంగా చెబుతున్న మాటలివి. ఇంతకీ ఆ గ్రావెల్ను తరలించిన లేఔట్ ఎక్కడ? అంటే ఆయన నోరు విప్పరు. పరిసరాల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు.
గొల్లనపల్లి(గన్నవరం గ్రామీణం), న్యూస్టుడే: గన్నవరం మండలం గొల్లనపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెం:88లో 491.16 ఎకరాల ప్రభుత్వ కొండ పోరంబోకు స్థలం ఉంది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయానికి ఎడమ వైపు.. కొండ పోరంబోకు స్థలంలో కొన్నాళ్లుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగుతున్నాయి. గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు జగనన్న కాలనీ పేరుతో తవ్వకాలు సాగిస్తున్నారు. ‘జగనన్న కాలనీ గొల్లనపల్లి’ అని అక్కడ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ రెవెన్యూ యంత్రాంగం కనీసం సదరు లేఔట్ను గుర్తించలేదని ఆయా వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. లేఔట్ గుర్తించకుండానే ఏకంగా ఆరు ఎకరాల్లోని మట్టి తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నా.. అధికారులు కనీసం అటు చూడని పరిస్థితి. పగలంతా స్తబ్దుగా ఉంటూ.. రాత్రివేళల్లో జగనన్న కాలనీల మెరక చేస్తారా? అంటూ తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సర్వే నంబర్లో ఆలయానికి కుడి వైపు ఉన్న కొండను కూడా హనుమాన్జంక్షన్కు చెందిన మరో వ్యక్తి రాత్రి వేళల్లో తవ్వకాలు సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు యాభై ఎకరాల్లోని మట్టిని గత పది రోజులుగా విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నట్లు నాయకులు ఆరోపించారు. అధికార వైకాపా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో మైనింగ్, రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదంటున్నారు. పేదలకు స్థలాలివ్వడం మంచి విషయమే కానీ సరిచేసిన అనంతరం గ్రావెల్ ఎక్కడుందో నిర్వాహకులు, అధికారులు చూపించాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అక్రమ తవ్వకాలపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్