సాఫ్ట్వేర్ రంగం.. భవితకు మార్గం
ప్రపంచ సాంకేతిక పురోగతికి అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని, అప్పుడే మెరుగైన అవకాశాలు అందుకుంటారని మైక్రోసాఫ్ట్ సీనియర్ డైరెక్టర్ బొల్లేపల్లి మాధవి అన్నారు. బుధవారం వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎఫోసెక్-2024 జాతీయ స్థాయి టెక్నో ఫెస్టివల్లో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు.
ప్రసంగిస్తున్న మాధవి బొల్లేపల్లి
కానూరు, న్యూస్టుడే: ప్రపంచ సాంకేతిక పురోగతికి అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని, అప్పుడే మెరుగైన అవకాశాలు అందుకుంటారని మైక్రోసాఫ్ట్ సీనియర్ డైరెక్టర్ బొల్లేపల్లి మాధవి అన్నారు. బుధవారం వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎఫోసెక్-2024 జాతీయ స్థాయి టెక్నో ఫెస్టివల్లో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం మన జీవితాలకు కేంద్రంగా మారిందన్నారు. ఇందులో రాణించాలంటే అవసరమైన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరచుకోవాలన్నారు. కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ జితేందర్సింగ్ ప్రసంగిస్తూ ఏఐ నుంచి బ్లాక్చైన్ వరకు, పునరుత్పాదక శక్తి నుంచి అంతరిక్షం వరకు సాంకేతికత పరుగులు తీస్తోందని, దానికి తగిన పరిజ్ఞానం పొందాలన్నారు. ప్రిన్సిపల్ ఏవీ రత్నప్రసాద్ మాట్లాడుతూ వికసిత్ భారత్-2047 లక్ష్యంగా దేశ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం తదితర అంశాలపై ఫెస్ట్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన 1,500 మంది విద్యార్థులు పత్ర సమర్పణ, పోస్టర్ ప్రెజంటేషన్, ప్రాజెక్టు ఎక్స్పో తదితర 50 అంశాల్లో పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతులు ప్రకటించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన ఫ్లాష్ మ్యాబ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సీఎస్ఈ విభాగాధిపతి సీహెచ్ రాజేశ్వర రావు, సిద్ధార్థ అకాడమీ సెక్రటరీ పాలడుగు లక్ష్మణరావు, కన్వీనర్ మలినేని రాజయ్య, డీన్లు బావినేని పాండురంగారావు, ఎంవీఎస్రాజు, నర్రా రవికుమార్, ఆలపాటి వెంకటేశ్వర్లు, నాగరాజు, ప్రవీణ్, ఏవో సాయిబాబు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
మాట్లాడే స్మార్ట్ బాట్
రాజకీయ పార్టీ జెండాలతో అత్యుత్సాహం
ఎఫోసెక్-2024లో భాగంగా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫ్లాష్ మాబ్లో కొందరు విద్యార్థులు తెదేపా, వైకాపా, జనసేన జెండాలు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, పోటాపోటీగా కేకలు వేస్తూ కవ్వించుకున్నారు. సమాచారం అందుకున్న ప్రిన్సిపల్ రత్నప్రసాదు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని వారిని మందలించారు. పార్టీల పతాకాలను సిబ్బంది లాగేసి పంపేశారు. అంతకుముందు మైదానంలో వైకాపా మద్దతుదారులు కార్లతో హల్చల్చేశారు. పైవంతైన నుంచి పార్టీ జెండాలు చూపుతూ రెచ్చగొట్టేందుకు యత్నించారు. కళాశాల అధ్యాపకులు రంగంలోకి దిగి వారిని తీవ్రంగా మందలించి పంపించేశారు.
రామాయణం ఘట్టాన్ని ప్రదర్శిస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే