కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణుకు విముక్తి
విజయవాడలో 2015లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో నగర సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టేసింది.
కేసు కొట్టేసిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం
ఈనాడు - అమరావతి: విజయవాడలో 2015లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో నగర సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టేసింది. ఇందులో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఈమేరకు బుధవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారి గాయత్రీదేవి తీర్పు ఇచ్చారు. ఈ ఘటనపై అప్పట్లో కృష్ణలంక పోలీసులు ఐపీసీ సెక్షన్లు 328, 304 రెడ్ విత్ 34తో పాటు ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 37 కింద కేసు నమోదు చేశారు. ఆతర్వాత ఈ కేసును మహేష్చంద్ర లడ్హా నేతృత్వంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తు చేసింది. ఛార్జిషీట్లో ఐపీసీ 420, 272, 273, 284, 337, 120 (బి), 304 (ఏ) రెడ్ విత్ 304తో పాటు ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్లు 36, 37 (ఏ), బినామీ లావాదేవీలు (నిరోధక) చట్టంలోని సెక్షన్ 3 (3) జోడించారు. ఈ కేసులో సిట్ 15 మందిని నిందితులుగా పేర్కొంది. 155 మందిని సాక్షులుగా అభియోగపత్రంలో చేర్చారు.
మద్యం తాగి ఆరుగురి మృతి: కృష్ణలంకలో స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో 2015, డిసెంబరు 7న ఉదయం.. అదే ప్రాంతానికి చెందిన 29 మంది మద్యం తాగారు. వెంటనే వీరంతా పడిపోయారు. హుటాహుటిన వీరిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆరుగురు మరణించారు. వీరంతా కూలినాలి చేసుకుని జీవనం సాగించే వారే. మిగిలిన వారు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొంది ఆ తర్వాత డిశ్ఛార్జి అయ్యారు. ఈ బార్ వైకాపాకు చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణుది కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి బార్లో భాగస్వాములుగా ఉన్న భగవంతుల శరత్చంద్ర, కావూరి పూర్ణచంద్ర శర్మ, కావూరి లక్ష్మీ సరస్వతి, మల్లాది బాల త్రిపుర సుందరమ్మలను ఏ1 నుంచి ఏ4గా చేర్చారు. విష్ణు తల్లి బాల త్రిపుర సుందరమ్మను ఏ4గా చేర్చారు. విష్ణును ఏ9గా, సోదరుడు మల్లాది శ్రీనివాస్ను ఏ10గా ఛార్జిషీట్లో చేర్చారు. మొత్తం నిందితుల్లో బాలా త్రిపురసుందరమ్మ, పొలాకి శ్రీనివాసరావు, పి.వెంకటరాజు, బి. శ్రీనులు మరణించారు. మద్యం నమూనాల్లో సైనేడ్ అవశేషాలు ఉన్నాయని హైదరాబాద్లోని ఏపీఎఫ్ఎస్ఎల్, మిథైల్ ఆల్కహాల్తోపాటు సోడియం సైనేడ్ ఉందని సీఎఫ్ఎస్ఎల్ తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ కేసుల్లో అప్పట్లో మల్లాది విష్ణు అరెస్టు అయి జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు. సాక్షుల సంఖ్య భారీగా ఉన్నా.. నిరూపణ విషయంలో ప్రాసిక్యూషన్ విఫలమవడంతో న్యాయాధికారి కేసును కొట్టేశారు. దీంతో విష్ణుతో పాటు మరో పది మందికి విముక్తి లభించినట్లైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్