సర్కిల్ దాటని విభజన
ప్రజల సౌకర్యార్థం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. పూర్తి స్థాయిలో సమస్యలను నేటికీ పరిష్కరించలేదు. విద్యుత్తు శాఖను ఇంకా విభజించకపోవడంతో వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
కొత్త జిల్లాలు వచ్చినా అతీగతీ లేదు
ఈనాడు, అమరావతి: ప్రజల సౌకర్యార్థం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. పూర్తి స్థాయిలో సమస్యలను నేటికీ పరిష్కరించలేదు. విద్యుత్తు శాఖను ఇంకా విభజించకపోవడంతో వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సంగతి అటుంచితే.. ప్రజల ఇబ్బందులు మాత్రం పెరిగాయి. వీరితోపాటు అధికారులు కూడా కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. పలు సేవలకు సంబంధించి జిల్లా కేంద్రం, సర్కిల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సర్కిల్ పరిధి మూడు జిల్లాల్లో విస్తరించి ఉండడం గందరగోళానికి తెరతీస్తోంది. అదనపు వ్యయం, ఉద్యోగాల భర్తీని తప్పించుకునేందుకే ప్రభుత్వం సర్కిళ్లను జిల్లాలు యూనిట్గా విభజించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంకా గందరగోళమే.. 2022 ఏప్రిల్లో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను పునర్ వ్యవస్థీకరించారు. ఈమేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రాంతాలు మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. మచిలీపట్నం పార్లమెంటు పరిధిని కృష్ణా జిల్లాగా, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు. ఏలూరు పార్లమెంటు పరిధిలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను విడదీసి ఏలూరు జిల్లాలో విలీనం చేశారు. గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే విద్యుత్తు సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. చిన్న జిల్లాల ఏర్పాటుకు తగ్గట్లుగా అన్ని శాఖలను విభజించినా.. కీలకమైన విద్యుత్తు శాఖ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విజయవాడ సర్కిల్ సెంట్రల్ డిస్కమ్ పరిధిలో ఉంది. ఏలూరు జిల్లాలో విలీనమైన నూజివీడు, కైకలూరు పరిధి మాత్రమే సీపీడీసీఎల్ అజమాయిషీలో ఉంటుంది. ఆ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు ఈపీడీసీఎల్ పర్యవేక్షణలో ఉంటాయి. దీని వల్ల ఒకే జిల్లా రెండు డిస్కమ్ల పరిధిలోకి వెళ్లినట్లు అయింది. ఇది మరింత గందరగోళానికి తావిస్తోంది.
అన్నింటికీ ఇబ్బందులే..
కొత్త జిల్లాలు ఏర్పాటై రెండేళ్లు అవుతున్నా.. సర్కిల్ కేంద్రంగానే విద్యుత్తు శాఖలో పర్యవేక్షణ సాగుతోంది. జిల్లాల పరిధి ప్రకారం మూడు సర్కిళ్లుగా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే.. ప్రజలకు మరింత ప్రయోజనం కలిగేది. కానీ.. ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఈ ఊసే ఎత్తడం లేదు. ఆయా జిల్లాల వినియోగదారులు, వారి అవసరాలకు తగ్గట్లు ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సి ఉంది. కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పక్కనపెట్టేసింది. దీన్ని తప్పించుకునేందుకే విభజన జోలికి వెళ్లడం లేదు.
- కొన్ని రకాల విద్యుత్తు కనెక్షన్ల కేటగిరీ మార్చుకునేందుకు ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత కలెక్టర్ నుంచి తీసుకుని, ఆతర్వాత.. సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇది వినియోగదారులకు ప్రయాసతో కూడిన పని. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే స్పందనలో ఫిర్యాదులు ఇస్తే.. అవి పరిష్కారానికి ఎస్ఈ కార్యాలయానికి వస్తున్నాయి. అక్కడి నుంచి సంబంధిత డివిజన్ కార్యాలయాలకు పంపడంతో సమయం వృథా అవుతోంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలకు ఎస్ఈ బదులు డివిజన్ అధికారులే వస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు