రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులు కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
కేంద్రాలకు అరగంట ముందే రావాలి
సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా
కంచికచర్ల, న్యూస్టుడే: ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులు కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్టికెట్లను ఇప్పటికే ప్రిన్సిపల్స్ లాగిన్లలో ఉంచారు. తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు, విజయవాడలోని డీఐఈవో కార్యాలయాలకు అనుసంధానం చేశారు.
75,576 మంది విద్యార్థులు
ఎన్టీఆర్ జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి, రెండో ఏడాది విద్యార్థులు కలిపి 75,576 మంది హాజరుకానున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 17స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 99 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, 03 సిట్టింగ్, 05 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఇన్విజిలేటర్లు, కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా డీఐఈవో సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులతో పాటు సిబ్బంది కేంద్రాల్లోకి చరవాణి తీసుకెళ్లడానికి వీల్లేదు. చీఫ్ సూపరింటెండెంట్ ఒక్కరికే కీప్యాడ్ ఫోన్ అనుమతిస్తారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లకూడదు. ఫిర్యాదులుంటే 7075136947 నంబర్కు ఫోన్ చేయవచ్చు.’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం