పండు చిక్కాడు
ఓ వేడుకలో యువకుడిపై బీరుసీసాతో దాడి చేసి పరారైన గ్యాంగ్వార్ కేసు ప్రధాన నిందితుడు రౌడీషీటర్ కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు ఎట్టకేలకు జిల్లా పోలీసులకు చిక్కాడు. ఉయ్యూరు పోలీస్స్టేషన్లో డీఎస్పీ జయసూర్య బుధవారం పండుతో పాటు అతని అనుచరుల అరెస్టు చూపించి కేసు వివరాలు వెల్లడించారు.
యువకుడిపై దాడి కేసులో అరెస్టు
నిఘా కొరవడి పేట్రేగిన రౌడీషీటర్
విజయవాడ, ఉయ్యూరు, న్యూస్టుడే: ఓ వేడుకలో యువకుడిపై బీరుసీసాతో దాడి చేసి పరారైన గ్యాంగ్వార్ కేసు ప్రధాన నిందితుడు రౌడీషీటర్ కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు ఎట్టకేలకు జిల్లా పోలీసులకు చిక్కాడు. ఉయ్యూరు పోలీస్స్టేషన్లో డీఎస్పీ జయసూర్య బుధవారం పండుతో పాటు అతని అనుచరుల అరెస్టు చూపించి కేసు వివరాలు వెల్లడించారు. వీరమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 25న ఓ విందు కార్యక్రమంలో నిందితుడు పండు బీరుసీసా పగులగొట్టి సంతోష్ని గాయపర్చాడు. అనంతరం పండుతో పాటు ఆయా వర్గాలు విజయవాడకు పారిపోయారన్నారు. దీనిపై ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి బుధవారం కంకిపాడు సమీపంలో పండును అదుపులోకి తీసుకున్నామని జయసూర్య తెలిపారు. ఇతనిపై గ్యాంగ్వార్, దొమ్మి, హత్యా, హత్యాయత్నం, గంజాయి వంటి కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. కంకిపాడు, ఉయ్యూరు పట్టణ సీఐలు శ్రీనివాసరావు, హబీబ్ బాషా, పట్టణ ఎస్.ఐ గణేష్కుమార్ పాల్గొన్నారు.
పోలీసుల నిఘా వైఫల్యం...
పండు పెనమలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని సనత్నగర్లో నివాసం ఉంటున్నాడు. జిల్లాలు విభజన కాకముందు పెనమలూరు పోలీస్స్టేషన్ కూడా నగర కమిషనరేట్ పరిధిలో ఉండేది. దీంతో పండు గ్యాంగ్పై పోలీసుల నిఘా ఉండేది. జిల్లా విభజన తర్వాత పెనమలూరు పోలీస్స్టేషన్ కృష్ణ జిల్లా ఎస్పీ పరిధిలోకి వెళ్లినప్పటి నుంచి పండు ఆగడాలు ఎక్కువయ్యాయి. పోలీసులు కనీసం నిఘా ఏర్పాటు చేయకపోవడంతో పండు తన ఇంట్లో అక్రమంగా తుపాకీ ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. తన కారులో కూడా నిత్యం కత్తులు ఉంచుకుంటాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రీల్స్ చేస్తూ....బెదిరిస్తూ..
పోలీసులను బెదిరిస్తూ, కత్తులు పట్టుకుని రీల్స్ చేయడం పండు నైజం. వాటిని తన అనుచరుల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పెట్టిస్తాడు. తన కారుకు ముందు ద్విచక్ర వాహనాలతో యువకులు ఎస్కార్ట్గా ఉంటారు. స్థానికంగా ఉండే యువకులకు గంజాయి అలవాటు చేసి వారిని తన వెంట తిప్పుకుంటాడని పోలీసుల దర్యాప్తులో సైతం తేలింది.
ఏకు మేకయ్యాడు..
సాధారణంగా తరుచూ గొడవలు, అల్లర్లుకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిత్యం నిఘా పెడుతుంటారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన గ్యాంగ్వార్ కేసులో పండు ప్రధాన నిందితుడు. ఇతనిపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. హత్య, హత్యాయత్నం, దాడులు, దొమ్మీలు, గంజాయి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం లాంటి అనేక కేసులు నమోదు అయ్యాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసులు హడావుడి చేసి అరెస్టు చేయడం.. జైలు నుంచి మళ్లీ బయటకు రాగానే అతను తన కార్యకాలాపాలను సాగిస్తూ పోలీసులకు ఏకు మేకు అవుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు