యూకే పంపిస్తామని మోసం
యూకే పంపిస్తామని మోసానికి పాల్పడిన ఇద్దరిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భవానీపురంలో పి.మర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య సునీతారెడ్డికి యూకే వీసా కోసం 2022లో ప్రయత్నించారు.
రూ.18 లక్షల వసూలు
భవానీపురం, న్యూస్టుడే : యూకే పంపిస్తామని మోసానికి పాల్పడిన ఇద్దరిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భవానీపురంలో పి.మర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య సునీతారెడ్డికి యూకే వీసా కోసం 2022లో ప్రయత్నించారు. ఆ సమయంలో బందరు రోడ్డులోని ఓ కన్సల్టెన్సీలో పని చేసే వ్యక్తి ద్వారా భవానీపురంలో నివాసం ఉండే వడ్డాది లావణ్య పరిచయమైంది. లావణ్యను సంప్రదించగా యూకే పంపేందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందని చెప్పింది. ఆ ప్రకారం భవానీపురంలోని ఆమె ఇంటికి వెళ్లి రూ.1.35 లక్షలు అడ్వాన్స్గా చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ఐదు విడతల్లో రూ.14.65 లక్షలు ఇచ్చారు. రోజులు గడుస్తున్నా వీసా రాకపోవడంతో లావణ్యను సంప్రదించగా త్వరలోనే వస్తుందంటూ నమ్మబలికింది. ఈ లోపు ఆమె మరిది సాతూపాటి అరవింద్కుమార్ అలియాస్ సోను వారి వద్దకు వచ్చి యూకే విమాన ఖర్చులు, వసతి కోసం మరో రూ.2లక్షలు ఇవ్వాలని లావణ్య చెప్పినట్లు చెప్పగా ఆ మొత్తాన్ని కూడా ఇచ్చారు. రోజులు గడుస్తున్నా వీసా రాకపోవడంతో లావణ్య గురించి విచారణ చేయగా ఆమెపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిసింది. ఆమెను సంప్రదించగా రూ.10 లక్షలకు చెక్కు ఇస్తానని, మిగిలిన మొత్తం మరిది సోనూ ద్వారా పంపుతానని చెప్పింది. ఈ నెల ఫిబ్రవరి 1న డబ్బుల గురించి సోనూను సంప్రదించగా ఇచ్చేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని బెదిరించాడు. తనకు కేసులు కొత్తకాదని పేర్కొన్నాడు. దీనితో మర్రెడ్డి భవానీపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వడ్డాది లావణ్య, అరవింద్కుమార్ అలియాస్ సోనుపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా సోనుపై భవానీపురం పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు