logo

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెండి కానుకల విరాళం

కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అవనిగడ్డకు చెందిన పరిశె మణి కుమార్ 280 గ్రాముల వెండి అర్ధకిరీటం విరాళం అందించారు.

Published : 29 Feb 2024 16:33 IST

మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అవనిగడ్డకు చెందిన పరిశె మణి కుమార్ 280 గ్రాముల వెండి అర్ధకిరీటం విరాళం అందించారు. ఈ మేరకు ఆయన ఆలయ అధికారులకు వెండి కిరీటం అందించారు. దాతలను అధికారులు సన్మానించారు. అనంతరం చీరాలకు చెందిన పసుపులేటి శ్రీనివాస్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కిలో వెండి నాగ పడగను స్వామివారికి విరాళం అందించారు. ఈ మేరకు ఆలయ అధికారులకు విరాళం అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని