ఓటుతోనే ప్రజాస్వామ్యానికి ఊపిరి
గతి తప్పిన వ్యవస్థలతో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచించాలని ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం, వేదికపై ఫోరం సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి తదితరులు
కలెక్టరేట్(మచిలీపట్నం): గతి తప్పిన వ్యవస్థలతో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచించాలని ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళాజాతాలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం పద్మావతి మహిళా కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చట్ట సభలకు ఎన్నికవుతున్న వారిలో అధికశాతం మంది వాటి హుందాతనాన్ని దిగజార్చేలా చేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత సమాజంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని, తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని ప్రశ్నించే పరిస్థితులు లేకుండా పోయాయని వాపోయారు. ప్రజలకు సమాన హక్కులు లేవని, ఇసుక దోపిడీ, మద్యం మాఫియా, సహజ వనరులను కొల్లగొట్టడం, చెట్లు నరికివేయడం వంటి అకృత్యాలు నిత్యకృత్యంగా మారిపోవడం బాధాకరమన్నారు. చట్టసభల్లో చట్టాల రూపకల్పన విషయంలో ఏమాత్రం అవగాహన లేని నాయకులు ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని వ్యక్తిగత ధనార్జన, తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను బెదిరించడం, బదిలీ చేయించడం వంటి చర్యలకు పరిమితం అవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఓటు దొంగలున్నారని, ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును పరిశీలించుకోవడంతో పాటు ఏ బూత్లో తాము ఓటు వేయాలన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలన్నారు. ఏదైనా తేడా గుర్తిస్తే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితా విడుదల వరకూ తమ అభ్యంతరాలను జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవచ్చని తెలిపారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రే స్వయంగా వాలంటీర్లను ఎన్నికల సైన్యంగా, పోలింగ్ ఏజెంట్లుగా వాడుకోవాలని భావించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం