సామాన్యులకు చేరువగా మహాశతావధానం
సామాన్యులకు చేరువైన శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం అందరి మన్ననలు పొందిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు అన్నారు.
నాగఫణిశర్మను సత్కరించి అమ్మవారి చిత్రపటం ఇస్తున్న జస్టిస్ దుర్గాప్రసాదరావు, పక్కన ఈవో రామారావు, రాంబాబు
ఇంద్రకీలాద్రి, న్యూస్టుడే : సామాన్యులకు చేరువైన శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం అందరి మన్ననలు పొందిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం శుక్రవారంతో ముగిసింది. 126 మంది పండితులు జగన్మాత దుర్గమ్మకు సంబంధించి ఇంద్రకీలాద్రి వైభవం, దసరా ఉత్సవాల్లో ఉగ్రరూపం, శాంత రూపం విశిష్టత, అమ్మను నమ్ముకొంటిని వంటి అంశాలపై ప్రశ్నలు సంధించగా సహస్రావధాని నాగఫణిశర్మ అలవోకగా గేయ, పద్య రూపంలో సమాధానాలు ఇచ్చి సాహితీప్రియులను, సామాన్యులను అలరించారు. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ ఐదు రోజులపాటు తెలుగు సాహితీ ప్రియులు, పండితులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు ఆవధాన ప్రక్రియలో పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలన్నారు. సహస్రావధాని నాగఫణి శర్మ మాట్లాడుతూ ఐదు రోజుల్లో 30 దత్తపదులు, 30 వర్ణనలు, 30 సమస్యలు ఆశువులతో శతావధానం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిందన్నారు. సాంస్కృతిక రాజధాని పేరును సార్ధకం చేస్తూ శతావధానాన్ని ఆదరించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ, దుర్గగుడి ట్రస్టుబోర్డు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి వారి శివ తాండవగానం చేయాలని న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు కోరగా నాగఫణి శర్మ జనరంజకంగా ఆలపించారు. అవధాన ప్రక్రిలో పాల్గొన్న పృచ్ఛకులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో రామారావు, ట్రస్టుబోర్డు ఛైర్మన్ రామారావు, ఈఈ కోటేశ్వరరావు, రమాదేవి, స్థానాచార్య శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకరశాండిల్య, యజ్ఞనారాయణశర్మ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్