త్వరలో అందుబాటులోకి కార్గో సేవలు
మరో రెండు నెలల్లో విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు అందుబాటులోకి తెస్తామని విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు.
సమావేశంలో చర్చిస్తున్న డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి, హాజరైన ప్రతినిధులు
ఈనాడు డిజిటల్, అమరావతి: మరో రెండు నెలల్లో విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు అందుబాటులోకి తెస్తామని విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ సమావేశ మందిరంలో వ్యాపార, వర్తక సంస్థల ప్రతినిధులతో ‘పరస్పర చర్చ’ (ఇంటరాక్టివ్ మీటింగ్) సమావేశం శుక్రవారం జరిగింది. లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతి వేగంగా విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి చెందుతోందన్నారు. ‘ఈ విమానాశ్రయానికి విశాలమైన భూమి, అతి పెద్ద రన్వే ఉంది. ఇక్కడ 22 విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు. ఎంత అభివృద్ధి చెందినా.. సరిపడా వనరులు ఇక్కడ ఉన్నాయి. రూ.500 కోట్లతో బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు నవంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. విజయవాడ విమానాశ్రయం నుంచి రోజూ 18 విమానాలు దేశవాళీగా, వారానికి రెండుసార్లు షార్జాకు ఎయిర్లైన్ సదుపాయం ఉంది. విజయవాడ నుంచి సింగపూర్, దుబాయి, శ్రీలంక, థాయిలాండ్ పర్యటనకు వెళ్లేందుకు వీలుగా ఎయిర్లైన్స్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకు పలు ఎయిర్లైన్సుకు ఇది వరకే వినతులు అందించామన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి విజయవాడకు కార్గో సదుపాయం ఉన్నా.. ఇక్కడ నుంచి కార్గో సదుపాయం లేదు.. మన వద్ద కూడా కల్పిస్తే విజయవాడ నుంచి వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకునే వీలుందని ట్రావెలర్ యాజమాన్య సంఘ ప్రతినిధి సూచించగా.. మరో రెండు నెలల్లో కార్గో సేవలు అందుబాటులోకి తెస్తామనీ.. తద్వారా విమానాశ్రయానికి కూడా ఆదాయం పెరుగుతుందన్నారు. అలాగే.. విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేవారికి ప్రయాణికులకు సౌకర్యాలు అంతంతగానే ఉన్నాయని ఓ వ్యక్తి విన్నవించగా.. ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా వసతులు, ఏర్పాట్లకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశానికి హాజరైన హోటల్స్, ట్రావెల్స్, బిల్డర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్