ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ పరీక్ష
ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ పరీక్షలు తప్పడం లేదు. శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. కళాశాలల బస్సులు, ద్విచక్రవాహనాలపై పరీక్షలకు వెళ్లే వారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి.
పరీక్ష ముగిసిన సమయంలో బెంజి సర్కిల్లో నిలిచిన వాహనాలు
పటమట, న్యూస్టుడే: ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ పరీక్షలు తప్పడం లేదు. శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. కళాశాలల బస్సులు, ద్విచక్రవాహనాలపై పరీక్షలకు వెళ్లే వారితో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలైన నిడమానూరు, గూడవల్లి వైపు ఎక్కువగా పరీక్ష కేంద్రాలు ఉండడంతో తల్లిదండ్రులతో కలిసి ఉదయం 8 గంటల నుంచి ఆయా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. ఆ సమయానికి కేంద్రాల గేట్లు తెరవకపోవడంతో నిడమానూరు నుంచి కేసరపల్లి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇందులో వందలాది మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుండటం, మరోవైపు ట్రాఫిక్ కదలకపోవడంతో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆందోళన చెందారు. కొంతమంది వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేసి నడుచుకుంటూ పరీక్ష కేంద్రాలకు వెళ్లారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో పరీక్ష 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవడంతో మధ్యాహ్నం 12.20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. బెంజ్సర్కిల్ జంక్షన్, రామవరప్పాడు రింగ్, మహానాడు కూడలి, పీబీ సిద్ధార్థ కళాశాల జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ నెలకొంది. కాగా, నగరంలోని బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల, శారద కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఎస్.డిల్లీరావు తనిఖీ చేశారు.
నియంత్రణ చర్యలేవీ..?
ముందుగానే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. నిడమానూరు, గూడవల్లి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను తీసుకువచ్చిన బస్సులు, కార్లకు పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంతో వాహనాలను రోడ్డు మీద నిలిపివేశారు. ఫలితంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. మరోవైపు కళాశాల నిర్వాహకులతో సైతం పోలీసులకు సమన్వయం కొరవడింది. కనీసం శనివారం రోజు నుంచైనా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
శారద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వద్ద తనిఖీ చేస్తున్న సిబ్బంది
గంగూరులో బస్సుల కోసం నిరీక్షణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం