నోటికి వెలకడుతూ.. నోటుతో జో కొడుతూ..!
వైకాపా ద్వితీయశ్రేణికి తాయిలాల ఎర
ఈనాడు, అమరావతి: ‘ముఖ్య నేతలతో పాటు వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోకుండా ఉంచడం ఎలాగో తెలియక.. కొత్త ఇన్ఛార్జులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఆర్థిక ప్రయోజనాలు ఎరవేస్తూ.. పార్టీలోనే ఉండాలని బతిమాలేే పరిస్థితి వచ్చింది. విజయవాడ శివార్లలోని ఓ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి మొత్తం ఖాళీ అవుతుండగా పార్టీలోనే ఉండాలని సర్పంచులను సామాజిక వర్గాల వారీగా విభజించి మరీ తాయిలాలు పంచుతున్నారు. ఖర్చులుంటాయ్ కదా.. ఉంచండి అని ఓ సామాజిక వర్గానికి చెందిన ఒక్కో సర్పంచికి రూ.50వేలు, ఎంపీటీసీలకు రూ.25 వేల చొప్పున ఇస్తున్నట్లు తెలిసింది. పార్టీలోనే ఉంటే మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని మరీ నేతలు వెళ్లకుండా ఆపేందుకు ఆపసోపాలు పడుతున్నారు.’
విజయవాడ మధ్య నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన వర్గం నేతలు వెలంపల్లి శ్రీనివాస్కు ఏమాత్రం సహకరించడం లేదు. విష్ణుకు వైకాపా విజయవాడ నగరాధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆయనలో అసంతృప్తి ఏమాత్రం పోలేదు. పార్టీ నగరాధ్యక్ష బాధ్యతల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విష్ణు, ఆయన వర్గం నేతలు భావిస్తున్నారు. అందుకే వెలంపల్లికి ఇప్పటికీ సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో ఎలాగైనా మధ్య నియోజకవర్గంలో పాగా వేయాలని వెలంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని గత నెల రోజులుగా విస్తృతంగా చేపడుతున్నారు. ఏ ప్రాంతంలో ప్రచారం ఉంటే.. ఆ స్థానిక కార్పొరేటర్కే ఆ రోజు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికోసం రోజుకు రూ.25వేలను వెలంపల్లి ఇస్తున్నట్టు సమాచారం. కానీ.. దీనికి రెట్టింపు తమకు ఖర్చవుతోందని కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. అసలైన ప్రచారం ముందుంది కాబట్టి, అదనంగా పెట్టిన ఖర్చులు తాను ఇచ్చేస్తానని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటానంటూ వెలంపల్లి సర్ది చెబుతున్నట్లు తెలిసింది. ఎవరైనా బయట నుంచి వైకాపా ముఖ్య నేతలు వచ్చిన సమయంలో మాత్రమే.. మల్లాది విష్ణు, గౌతమ్రెడ్డి లాంటి వాళ్లు అయిష్టంగానే వస్తున్నారు. లేదంటే పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. తాజాగా 31వ డివిజన్లో వెలంపల్లి, కేశినేని నాని కలిసి గురువారం ప్రచారం నిర్వహించగా.. విష్ణు, గౌతమ్రెడ్డి కూడా వచ్చారు. కానీ ఆరంభం నుంచి చివరి వరకూ వీళ్లిద్దరూ కనీసం ముఖాలు కూడా చూసుకోకుండా.. ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఎవరి అనుచరులతో వాళ్లు దూరదూరంగానే ఉండడం గమనార్హం. సెంట్రల్ వైకాపాలో నేతల మధ్య సఖ్యత లేమికి నిదర్శనం.
జెండా మోస్తే రూ.200..
ప్రస్తుతం మధ్య నియోజకవర్గంలో వెలంపల్లి ప్రచారం ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ బ్యానర్లతో నింపేస్తున్నారు. రోజువారీ బ్యానర్లకు రూ.15వేలు ఖర్చవుతోందని, వాటిని అన్నిచోట్లా కట్టేందుకు మరో రూ.7వేల వరకూ అవుతోందని వైకాపాకు చెందిన ఓ నాయకుడు వెల్లడించాడు. ఇలాగే ప్రచారంలో హడావుడి కోసం వాడే డప్పులకు రూ.5వేలు, రోజూ జెండాలు మోసేందుకు 20 మందిని పెడుతున్నారు. వీరికి రోజుకు రూ.200 చొప్పున రూ.4వేల వరకూ ఇస్తున్నారు. రోజూ అల్పాహారం 150 మందికి పెట్టేందుకు ఒక్కొక్కరికీ రూ.40 చొప్పున వెచ్చిస్తున్నారు. పూలు జల్లేందుకు రూ.వెయ్యి, కొన్నిచోట్ల మహిళలు హారతులు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. హారతి పళ్లెంలో రూ.500 కచ్చితంగా పెట్టాలని నిర్ణయించారని వైకాపా నేతలు పేర్కొంటున్నారు. ఇలా.. రోజూ ముందే నిర్దేశించిన విధంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కానీ మధ్య నియోజకవర్గంలో వెలంపల్లి వర్గం ఎంతగా ప్రయత్నిస్తున్నా కేవలం అదంతా ప్రచార ఆర్భాటమే తప్ప జనం నుంచి అనుకున్నంత స్పందన మాత్రం రావడం లేదని వైకాపా నేతలే బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ప్రజల సంగతి సరే.. కనీసం వైకాపా నేతలూ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ఇక్కడ లేదు.
పెనమలూరులో విశ్వప్రయత్నాలు..
ఇటీవల ఉయ్యూరులో ప్రసంగిస్తున్న మంత్రి జోగి
ఎమ్మెల్యే పార్థసారథి, కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్(బుడ్డీ)తో కలిసి భారీగా పెనమలూరులోని వైకాపా నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లలోనూ ఇంకా చాలా మంది సారథితోనే కలిసి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. వారిని ఎలాగైనా పార్టీలోనే ఉంచేందుకు పెనమలూరు ఇన్ఛార్జి జోగి రమేష్, అతని వర్గం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే వారికి తాయిలాలను ఎరవేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పాస్టర్లు, వాలంటీర్లు, డ్వాక్రా గ్రూపులను నిర్వహించే ఆర్పీలు.. ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా.. డబ్బులు, తాయిలాలు విచ్చలవిడిగా పంచుతున్నారు. ఆసరా అధికారిక సభలనూ.. ప్రచారానికి వాడుకున్నారు. ఇలా జోగి వర్గం ఎన్ని చేస్తున్నా.. పెనమలూరు స్థానిక వైకాపా నేతల్లో అత్యధికులు సారథి వర్గం వాళ్లే కావడంతో వారిని పార్టీలో ఉంచడం అసాధ్యంగా మారుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఉన్నోళ్లను కాపాడుకునేందుకు తాయిలాలు ఎరవేస్తున్నట్టు తెలిసింది. అవికూడా ఎంపిక చేసిన కొందరికే ఇస్తుండడంతో మిగతా వాళ్లు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్