తెలుగుదేశానికి..జై
మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం హైదరాబాద్లో ఆ పార్టీలో చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు.
చంద్రబాబు సమక్షంలో వసంత చేరిక నేడు
వైకాపాను వీడిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు
హైదరాబాద్ వెళ్తూ.. అంబారుపేట సత్యమ్మతల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, శిరీష దంపతులు
ఈనాడు, అమరావతి: మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం హైదరాబాద్లో ఆ పార్టీలో చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు. తర్వాత మరోసారి మంగళగిరి తెదేపా కార్యాలయంలో అనుచరులతో చేరికకు భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వసంత అనుచరులు చెబుతున్నారు. బాబు సమక్షంలో చేరేందుకు శనివారం 15 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వసంత స్వగ్రామం ఐతవరం నుంచి .. ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం ముఖ్యనాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు.
- బందరు ఎంపీ బాలశౌరి ఇప్పటికే వైకాపాను వీడి జనసేనలో చేరారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా తెదేపాలో చేరగా నూజివీడు టికెట్ కేటాయించారు. విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, పెనమలూరు నాయకులు వైకాపాకు గుడ్బై చెప్పారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఆ పార్టీకి దూరం కాగా.. ఏ పార్టీలో చేరేదీ స్పష్టత ఇవ్వలేదు. సిటింగ్ ఎమ్మెల్యేను కాదని తెదేపా నుంచి చేరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు వైకాపా టికెట్ కేటాయించారు. రెండుసార్లు గెలిచిన రక్షణనిధి.. సీఎం జగన్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణును పక్కన పెట్టి.. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లికి.. సెంట్రల్ టికెట్ కేటాయించారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెలంపల్లికీ సహకరించడం లేదు. పశ్చిమ అభ్యర్థిగా ఆసిఫ్ను ప్రకటించడంతో పైలా స్వామినాయుడు, మరికొందరు సీనియర్లు దూరంగా ఉన్నారు. మైలవరంలోనూ తిరుపతిరావును ప్రకటించడంపై ఓ వర్గం అసంతృప్తితో ఉంది.
మార్పులపై కసరత్తు..
మార్పులపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్కు టికెట్ కేటాయిస్తే.. ఆయన పోటీ చేయనని తేల్చి చెప్పారు. తనయుడు రామ్చరణ్కు అవకాశం ఇవ్వాలని కోరగా పెండింగ్ పెట్టారు. సింహాద్రి రమేష్ను లోక్సభకు పంపాలని నిర్ణయించి ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారు. పార్టీలో చేరిన నూజివీడుకు చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మైలవరం లేదా గన్నవరం ఇవ్వాలనే చర్చ సాగుతోంది. విజయవాడ ఎంపీ బరిలో వల్లభనేని వంశీని లేదా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ను దింపాలనే ప్రతిపాదన ఉంది. సమన్వయకర్తలుగా నియమించిన వారు అభ్యర్థులుగా ఉండరేమోననే అనుమానంతో క్రియాశీలకంగా లేరనే చర్చ పార్టీలో జరుగుతోంది.
ఎవరు ఎక్కడో...?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెదేపా.. 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి జోరు మీదుంది. వైకాపా కేవలం రెండు పార్లమెంటు స్థానాలు.. 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తలనే నియమించింది. వీరిని మార్చే అవకాశాలు లేకపోలేదని చెబుతోంది. జగ్గయ్యపేటకు విప్ ఉదయభాను, నందిగామకు ఎమ్మెల్యే జగన్మోహన్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నా వారిపేర్లు ప్రకటించలేదు. విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా అవినాష్ ప్రచారం చేస్తున్నా.. అక్కడా ప్రకటించలేదు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడపైనా తాత్సారమే. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ పోటీ చేస్తారా లేదా అనే అనుమానం నెలకొంది. పామర్రు ఎమ్మెల్యే కైలే అభ్యర్థిత్వాన్ని తాజాగా సీఎం జగన్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..