logo

అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి

Updated : 02 Apr 2024 08:18 IST

భర్త నరేష్‌తో గీతాంజలి (పాత చిత్రం)

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందారు. ఈ ఘటనలో భర్త నరేష్‌, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం కొణకంచికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.


వడదెబ్బతో ఉపాధ్యాయిని మృత్యువాత

స్వరూపారాణి (పాతచిత్రం)

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామకు చెందిన ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయిని కొత్త స్వరూపారాణి(45) సోమవారం సాయంత్రం వడదెబ్బతో మృతిచెందారు. చందర్లపాడు మండలం చింతలపాడులో ఆమె గ్రామదేవతను దర్శించుకుని ఆలయం నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు ఆమెను వెంటనే నందిగామలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని