రైల్వే ఆస్తులపై వెలంపల్లి కన్ను
నగరంలో ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు కనిపించినా.. వైకాపా నాయకులు హస్తగతం చేసుకుంటున్నారు. వెలంపల్లి శ్రీనివాస్ రాకతో సెంట్రల్ నియోజకవర్గంలో మరింత ఊపందుకున్నాయి
క్రమబద్ధీకరణ పేరిట వ్యాపారులకు గాలం
బీఆర్టీఎస్ రోడ్డు
విజయవాడ, న్యూస్టుడే: నగరంలో ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు కనిపించినా.. వైకాపా నాయకులు హస్తగతం చేసుకుంటున్నారు. వెలంపల్లి శ్రీనివాస్ రాకతో సెంట్రల్ నియోజకవర్గంలో మరింత ఊపందుకున్నాయి. బుడమేరు కట్ట, ఇరిగేషన్ స్థలాలు మొత్తం ఆక్రమించగా.. ఇప్పుడు వారి కళ్లు రైల్వే స్థలాలపై పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. కబ్జా స్థలాలను రెగ్యులరైజ్ చేయిస్తామంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ఫుడ్ జంక్షన్ వరకు పాత సత్యనారాయణపురం రైల్వేస్టేషన్ ఉన్న సమయంలో.. దారి పొడవునా భారీగా రైల్వే శాఖకు చెందిన స్థలాలు ఉన్నాయి. ప్రధాన రహదారి రోడ్డు పక్కనే.. కోట్లాది రూపాయిల విలువైన ఈ స్థలాలను కొందరు వ్యాపారులు నగరపాలక సంస్థ అధికారులను మేనేజ్ చేసి.. రైల్వే స్థలం అని తెలిసినా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. ఇళ్లతో పాటు వ్యాపార సముదాయాలు నిర్మించారు. కోట్లా రూపాయిల విలువ చేసే స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆరు నెలల క్రితం.. రైల్వే అధికారులు ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి మార్కింగ్ చేశారు. దారి పొడవునా పొక్లెయిన్తో తవ్వి అడ్డంగా ఫెన్సింగ్ నిర్మించారు. ఆయా స్థలాల్లో ఎలాంటి కట్టడాలు చేసినా రైల్వే నిబంధనల ప్రకారం శిక్షార్హులని బోర్డులు ఏర్పాటు చేశారు. రైల్వే స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటే.. రైల్వే బోర్డు నుంచి అనుమతులు ఉండాలి. అది చాలా పెద్ద వ్యవహారం కావడంతో నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో వ్యాపారులు ఫెన్సింగ్ తొలగించి.. తిరిగి వ్యాపారాలు చేసుకుంటున్నారు.
భారీగా నిధుల చెల్లింపు
తనను గెలిపిస్తే బీఆర్టీఎస్ రోడ్డు పొడవునా ఉన్న ఆక్రమిత రైల్వే స్థలాలను అధికారులతో మాట్లాడి రెగ్యులరైజ్ చేయిస్తానని వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ స్థానిక వ్యాపారులకు హామీ ఇచ్చారు. ఇందుకు పార్టీ ఫండ్తో పాటు పరిసర ప్రాంతాల వారితో వైకాపాకే ఓట్లు వేయించాలని షరతు పెట్టారు. దీనికి ఆమోదం తెలిపిన వ్యాపారులు.. భారీగానే కొంత పార్టీ ఫండ్ ఇచ్చారు. ఒక్కో వ్యాపారి రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పనుల బాధ్యతలు వెలంపల్లి సామాజికవర్గానికే చెందిన లోటస్ ల్యాండ్ మార్కులో ఉండే నేతకు అప్పగించారు. ఇప్పటికే ఈ విషయాన్ని వెలంపల్లి శ్రీనివాస్.. రైల్వే అధికారులతో మాట్లాడారని, పని తప్పకుండా అవుతుందని సదరు నేత వ్యాపారుకుల హామీ ఇచ్చారు.
25 ఎకరాల స్థలంపైనా కన్ను
అజిత్సింగనగర్లో ఉన్న సుమారు 25 ఎకరాల రైల్వే భూములపైనా వైకాపా నేతల కళ్లుపడ్డాయి. గతంలో వాటిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా.. రైల్వే అధికారులు అడ్డుకున్నారు. చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. వైకాపా ప్రభుత్వం రావడంతో.. తిరిగి కబ్జా చేసేందుకు స్థానిక వైకాపా నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. తాజాగా ఆ స్థలంపైనా వెలంపల్లి శ్రీనివాస్ కళ్లుపడ్డాయి. కోట్లాది రూపాయిల విలువ చేసే రైల్వే స్థలాల ఆక్రమణలకు గురికాకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!