విధేయులనే వరించిన టికెట్లు!
పార్టీకి కష్టకాలంలో విధేయులుగా ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు లభించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలకు తొమ్మిది చోట్ల కాంగ్రెస్(ఐ) పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
కాంగ్రెస్ తొలి జాబితాలో 9 మందికి స్థానం
గన్నవరం బరిలో మిత్రపక్షం సీపీఐ..?
ఈనాడు, అమరావతి: పార్టీకి కష్టకాలంలో విధేయులుగా ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు లభించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలకు తొమ్మిది చోట్ల కాంగ్రెస్(ఐ) పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా లోక్సభ స్థానాలకు ప్రకటించలేదు. మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు కూతురుకు టికెట్ లభించడం విశేషం. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారికే అవకాశాలు లభించాయి.
కృష్ణా జిల్లాలో..!
పెనమలూరు నుంచి కానూరుకు చెందిన ఎలిసెల సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చారు. రిజర్వుడు సామాజికవర్గానికి చెందిన ఆయనకు జనరల్ స్థానం కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే డి.వై.దాస్కు పామర్రు కేటాయించారు. ఆయన గతంలో ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. గుడివాడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వడ్దాది గోవిందరావు, అలియాస్ రాజేష్కు కేటాయించారు. వడ్డాది చారిటబుల్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం డీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మచిలీపట్నం అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ మతీన్ను ఎంపిక చేశారు. నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పెడన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేశారు. అవనిగడ్డ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అందె శ్రీరాంమూర్తిని ఎంపిక చేశారు. 2011 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2019లో పోటీ చేశారు. ప్రస్తుతం మళ్లీ టికెట్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గానికి ఎంపిక చేయాల్సి ఉంది. మిత్రపక్షం సీపీఐకి కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. మచిలీపట్నం లోక్సభకు కాంగ్రెస్ కృష్ణ పేరు తెరమీదకు వచ్చింది. కానీ జాబితాలో మచిలీపట్నం ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు