రసీదు చూపినా ఎందుకు ఆపాల?
ఏలూరు జిల్లాకు పాలు, పాల పదార్థాలను సరఫరా చేసిన వ్యాను తిరుగు ప్రయాణంలో తమ ఏజెంట్ల వద్ద సొమ్ములు (కలెక్షన్లు) తీసుకుని సూపర్వైజర్లు వస్తున్నారు.
నగదు స్వాధీనం.. ఇదెక్కడి న్యాయం? '
జూ ‘విజయ’ డెయిరీ వ్యాన్లకు తనిఖీల దెబ్బ
ఈనాడు, అమరావతి : ఏలూరు జిల్లాకు పాలు, పాల పదార్థాలను సరఫరా చేసిన వ్యాను తిరుగు ప్రయాణంలో తమ ఏజెంట్ల వద్ద సొమ్ములు (కలెక్షన్లు) తీసుకుని సూపర్వైజర్లు వస్తున్నారు. నూజివీడు సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అంటూ తనిఖీ చేయగా మొత్తం రూ.5.3లక్షలు నగదు లభ్యమైంది. దీనికి తమ పాలు, పాల పదార్థాలకు సంబంధించిన సొమ్ములు అంటూ లెక్కలు చెప్పారు. అయినా బిల్లులు కావాలని అడిగారు. వాటికి ఉండవని, ప్రతి రోజూ ఇలాగే వసూలైన సొమ్ము తీసుకొస్తామని సమాధానం ఇచ్చారు. దీంతో మొత్తం సొమ్ము స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.వీటిలో అంతా రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు మాత్రమే ఉంటాయి. ఇది అక్రమ సొమ్ము ఎలా అవుతుందంటూ ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. రేపు మాపు అంటూ కలెక్టరేట్ చుట్టూ తిప్పుతున్నారు.
వేధింపులపై ఫిర్యాదుకు యోచన..
ఇదీ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ పాల సరఫరాదారులకు (విజయ డెయిరీ) ఎదురైన ఘటన. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయ డెయిరీ పాల వ్యాన్లను తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. పాల డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ప్రకారం రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు. అంతకు మించి తీసుకెళ్లినా తగిన రసీదులు చూపించాల్సి ఉంటుంది. ధాన్యం విక్రయించిన, ఇతర వ్యవసాయోత్పత్తులు విక్రయించగా వచ్చిన నగదు తీసుకెళ్తుంటే తగిన పట్టీలు చూపిస్తే సరిపోతుందని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కానీ దానికి విరుద్ధంగా విజయ డెయిరీ పాల వ్యాన్లలో నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయాలని విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు నిర్ణయించారు. కమిషనర్ అపాయింట్మెంట్ కోసం నిరీక్షిస్తున్నట్లు చెబుతున్నారు.
కంప్యూటరైజ్డ్ కావాలని పట్టు..
విజయవాడలో, బాపులపాడు మండలం వీరవల్లిలో విజయకు పాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. రోజూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు, గుంటూరు, ప్రకాశం, తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు పాలు సరఫరా చేస్తారు. ఆయా ప్రాంతాల్లో వీరి ఏజెంట్లు ఉన్నారు. రాత్రి పూట 110 రూట్లలో, పగలు 16 రూట్లలో వ్యాన్లు తిరుగుతాయి. రోజుకు 5లక్షల లీటర్ల పాలను రవాణా చేస్తుంటాయి. మొత్తం రూ.3కోట్ల టర్నోవర్ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 600 మంది అమ్మకందార్లు (ఏజెంట్లు) ఉంటారు. వీరిలో చాలా వరకు ఈ రోజు అమ్మకానికి సంబంధించిన సొమ్ములు వ్యాన్ డ్రైవర్లు, సూపర్వైజర్లుకు ఇస్తారు. కొంతమంది బ్యాంకుల ద్వారా, యూపీఐ(గూగుల్పే) ద్వారా చెల్లింపులు చేస్తారు. ఒక్కో వ్యానులో గరిష్ఠంగా రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు సొమ్ము తీసుకొస్తుంటారు. వీటికి ఆధారాలు ఉంటాయి. కానీ కంప్యూటరైజ్డ్ కావాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారని విజయ డెయిరీ అధికారులు వాపోతున్నారు. ఈనెల 29న నూజివీడులో ఆగిరిపల్లి వద్ద స్వాధీనం చేసుకున్న సొమ్ము ఇంతవరకు విడుదల చేయలేదు.
నిబంధనలు ఏం చెబుతున్నాయ్..!
అక్రమంగా రవాణా చేసే సొమ్ము నల్లడబ్బు అయితేనే స్వాధీనం చేసుకోవాలి. న్యాయపరంగా రైతుల సొమ్ము అయితే పరిశీలించి లెక్కలు అడిగి అధికారుల విచక్షణతో వదిలివేయాలని చెబుతున్నారు. ప్రధానంగా రైతులను వేధింపులకు గురి చేయకూడదనే గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశారు. పాల వ్యాన్లలో వచ్చే నగదు అంతా చిల్లర ఉంటుంది. రూ.500 కరెన్సీ నోట్లు ఉండడం లేదు. కేవలం రూ.100 నోటు లోపు డినామినేషన్ ఉంటుంది. దీన్ని నల్లడబ్బుగా అధికారులు ఎలా పరిగణిస్తారని సంస్థ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు చెల్లించాల్సిన సొమ్ములు స్వాధీనం చేసుకొని ఇబ్బందులు పెట్టడమేమిటని ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రశ్నించారు. గతంలో ఈ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గంలో తెదేపా సానుభూతిపరులు ఉండడంతో వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి