logo

నేడు, రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం బస్సు యాత్ర

ముఖ్యమంత్రి జగన్‌.. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులపాటు జరగనుంది.

Published : 13 Apr 2024 04:14 IST

ఈనాడు డిజిటల్‌ - అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌.. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులపాటు జరగనుంది. శని, ఆదివారాల్లో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం ఎన్టీఆర్‌ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. దుర్గగుడి వారధి నుంచి బందర్‌రోడ్డు, చుట్టుగుంట, సంగీత కళాశాల, బుడమేరు, ప్రకాశ్‌నగర్‌, రామవరప్పాడు, ప్రసాదôపాడు, ఎనికేపాడు, నిడమానూరు ప్రాంతాల్లో బస్సుయాత్ర చేయనున్నారు. శనివారం రాత్రికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం క్యాంపు శిబిరం నుంచి బయలుదేరి హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా బస్సు యాత్ర గుడివాడ చేరుకుంటుంది. అక్కడ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత గుడివాడ నుంచి బయలుదేరి గుడ్లవల్లేరు, పెడన, బంటుమిల్లి మీదుగా కృత్తివెన్ను చేరుకుంటుంది. అక్కడ రాత్రి బస చేస్తారు. సోమవారం అక్కడ నుంచి బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని