భయం భయం.. సమస్యలతో జీవనం
పెడనలోని రెండు ప్రాంతాల్లో పేదలకు ఏర్పాటు చేసిన నివాస కాలనీలు కష్టాలకు నిలయంగా మారాయి.
కనీస వసతులకునోచుకోని పేదల కాలనీలు
బల్లిపర్రు కాలనీలో నిరుపయోగంగా నివాసాలు
పెడన, న్యూస్టుడే: పెడనలోని రెండు ప్రాంతాల్లో పేదలకు ఏర్పాటు చేసిన నివాస కాలనీలు కష్టాలకు నిలయంగా మారాయి. 216 జాతీయ రహదారి పక్కగా శింగరాయపాలెం, బల్లిపర్రుల్లో ఏర్పాటైన వీటిలో దాదాపు 300లకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా ఈరెండు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఇక్కడ ఇళ్లు ఎందుకిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. బల్లిపర్రు కాలనీలో పెడన పట్టణ పేదలు నివసిస్తున్నారు. ఈ కాలనీ బల్లిపర్రు పంచాయతీలోకి వెళ్లడంతో అక్కడ ప్రగతి పూర్తిగా స్తంభించింది. శింగరాయపాలెం కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ డ్రెయిన్లు, రహదార్లు, తాగునీటి సౌకర్యంతో పాటు వీధి దీపాలు లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
విషసర్పాల సంచారం
కాలనీలోకి రాత్రి వేళల్లో విషసర్పాలు వస్తున్నాయి.వీధి దీపాలు లేక ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోంది. కాలనీ అభివృద్ధిని కొన్నేళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.పంట పొలాలను ప్లాట్లుగా మార్చి ఇళ్లు కట్టమన్నారు. ఇప్పటివరకు కాలనీలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. వర్షాలు వస్తే ముంపు బాధలు తప్పడం లేదు.
బొడ్డు చిట్టెమ్మ, అరుణ శింగరాయపాలెం కాలనీ
ఎవరూ పట్టించుకోరు
ఈ కాలనీ పరిధి బల్లిపర్రు పంచాయతీలోకి వస్తుంది. కాలనీ వాసులందరూ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. పంచాయతీ పట్టించుకోదు. మున్సిపాలిటీ కనికరించదు. ఏళ్లుగా మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నాం
పిండి జగన్మాత, బల్లిపర్రు కాలనీ
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా..
కాలనీ సమస్యను ఇప్పటివరకు నలుగురు కలెక్టర్ల దృష్టికి స్పందన ద్వారా తీసుకెళ్లాం. ఒక రోజు రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే కూడా చేపట్టారు. ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. కాలనీలో రహదార్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు, తాగునీటి సౌకర్యం లేక విషసర్పాల మధ్య జీవనం సాగిస్తున్నాం.
అన్నమనేని భవాని, బల్లిపర్రు కాలనీ
తాగునీటికి అవస్థలు
తాగునీటి సరఫరా లేదు. వేసవిలో మరింత ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు వస్తోన్నా సరిపోవడం లేదు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు.
బెజవాడ సత్యనారాయణ, శింగరాయపాలెం కాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు