ఎన్నికల విధుల నుంచి మినహాయించండి
దివ్యాంగులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారైనా సరే తప్పనిసరిగా ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు.
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగ ఉద్యోగులు
న్యూస్టుడే, గుడివాడ(నెహ్రూచౌక్)
కలెక్టరేట్లో ఉపాధ్యాయినుల నిరీక్షణ
దివ్యాంగులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారైనా సరే తప్పనిసరిగా ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. తమ వల్ల కాదని దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు మొర పెట్టుకుంటున్నా అధికారులు కనికరించడం లేదు. కలెక్టరుకు విన్నవించుకోవాలని ఉచిత సలహాలిస్తుండడంతో చేసేది లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పట్టించుకునే వారే కరవు
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఓ, ఏపీఓ, ఓపీఓ హోదాల్లో అధికారులు డ్యూటీలు వేశారు. అందులో భాగంగా ఈ సారి సిబ్బంది కొరత ఉందని.. దివ్యాంగులు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి, దీర్ఘకాలిక రోగులకు, ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్నవారికి, చివరకు వైద్య సెలవులో ఉన్నవారిని కూడా నియమించారు. గుడివాడలో గీతామహలక్ష్మి, గౌసియాబేగం అనే ఉపాధ్యాయినులు వంద శాతం దివ్యాంగులు. చక్రాల కుర్చీలో పాఠశాలకు వెళ్లేవారు. వారిని కూడా ఎన్నికల విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడంతో మానవతా దృక్పథంలో తమను తప్పించాలని వారు వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మా చేతిలో ఏమీ లేదని.. కలెక్టరుకు విన్నవించుకోవాలని చెప్పడంతో నిస్సహాయస్థితిలో అద్దె కారు మాట్లాడుకొని కలెక్టరేట్కు వెళ్లినా పట్టించుకున్న పరిస్థితి లేదు. మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకొని ఇబ్బందులు పడుతున్నానని మోటూరు గురుకుల పాఠశాలలో పనిచేసే ఒక ఉపాధ్యాయిని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మరికొందరు వైద్య సెలవులో ఉన్నప్పటికీ వీఆర్వోలను ఇళ్లకు పంపించి మరీ ఉత్తర్వులు అందజేస్తున్నారు.
ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు అమలు చేయాలి
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కొన్ని మినహాయింపులిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అమలు చేయాలని, దీంతోపాటు డివిజినల్ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక నమోదు కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖర్ కోరారు. గత ఎన్నికల్లో ఇబ్బందులున్నవారిని మినహాయించారు. గతంలో ఆర్టీవో కార్యాలయంలోనే ఈ ఏర్పాటు ఉండేదని.. ఇప్పుడు మచిలిపట్నం వెళ్లాలని చెప్పడం సరికాదని డెమొక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మత్తి వెంకటేశ్వరరావు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ ధర్నాతో అభాసు పాలైన జగన్ : దేవినేని ఉమా
[ 26-07-2024]
ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ దిల్లీ పారిపోయి అక్కడ ధర్నా చేసి అబాసు పాలయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. -
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
[ 26-07-2024]
గత నెలన్నరగా ఎన్టీఆర్ కమిషనరేట్లో నమోదైన సైబర్ మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే. పదుల సంఖ్యలో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. -
‘నా’దంటూ.. గుంజడమే ప‘ని’..!
[ 26-07-2024]
గుడివాడలో దశాబ్దాలుగా కళలకు వెలుగులద్దుతూ.. కళాకారులు, రచయితలు, కవులకు కేంద్రంగా ఉన్న ‘బారిష్టరు శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామిచౌదరి స్మారక కళాభవనం’ కబ్జా కోరల్లో చిక్కుకుంది. -
వైకాపా పా‘పాలు’.. వెంటాడే శాపాలు
[ 26-07-2024]
గతంలో జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన పాల వెల్లువ కార్యక్రమంపై గ్రామాల్లో తిరుగుబాటు మొదలైంది. -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు..!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు... నాటి జగన్ సర్కారు చేసిందిదే... -
పైవంతెన ప్రాజెక్టు డీపీఆర్కు వినతి
[ 26-07-2024]
జాతీయ రహదారి 16పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు నిర్మించే నాలుగు లైన్ల పైవంతెనకు సంబంధించి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కలిసి వినతిపత్రం అందజేశారు. -
నాణ్యత కల్ల.. దారులు గుల్ల
[ 26-07-2024]
నిత్యం ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వేలాది వాహనాలు రాకపోకలు సాగించే చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పరిస్థితి ఎప్పటికప్పుడు దారుణంగా మారింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళితులంతా ఏకం కావాలి. చైతన్యవంతం కావాలి. -
మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య కొత్త రైల్వేలైన్
[ 26-07-2024]
మచిలీపట్నం నుంచి నర్సాపూర్కు కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. -
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని తీర్పు
[ 26-07-2024]
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
[ 26-07-2024]
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తాడేపల్లి 12వ వార్డు సచివాలయ వీఆర్వో దుర్మరణం పాలయ్యారు. -
బోటు తిరగబడి మత్స్యకారుడి మృతి
[ 26-07-2024]
చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండల పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?