జగన్ పాలనలో పప్పన్నమూ కరవే
సంక్షేమ పాలన సాగిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న జగన్ ప్రభుత్వం పేద వర్గాలకు పప్పనం కూడా తినలేని పరిస్థితి కల్పిస్తోంది.
రెండేళ్లుగా 11,100 టన్నుల కందిపప్పుకు ఎగవేత
రూ.150 కోట్లకు పైగా పక్కదారి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
సంక్షేమ పాలన సాగిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న జగన్ ప్రభుత్వం పేద వర్గాలకు పప్పనం కూడా తినలేని పరిస్థితి కల్పిస్తోంది. తెదేపా పాలనలో పేదవర్గాలకు ఇతర నిత్యావసరాలు లేకుండా కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారంటూ నిప్పులు చెరిగిన జగన్ తన అయిదేళ్ల పాలనలో పేద వర్గాలకు పస్తులు ఉండే పరిస్థితులు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన రూ.2ల బియ్యాన్ని ఇవ్వకుండా ఎగగొట్టడమే కాకుండా పేదలకు కందిపప్పు సైతం దక్కకుండా చేసి తానేదో పేదల పక్షపాతిని అంటూ ప్రవచనాలు పలకడం గమనార్హం.
జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి సబ్సిడీ ధరకు చౌకడిపోల ద్వారా పేదలకు అందించాల్సిన నిత్యావసరాలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తోంది. చివరకు కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యంతో పాటు అరకొరగా ఇచ్చే అరకేజీ పంచదార మినహా పామాయిల్, గోధుమపిండి, కారం, తదితర నిత్యావసరాలు ఏనాటి నుంచో నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాలకు పండుగ సందర్భాల్లో ఉచితంగా అందజేసే సంక్రాతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్Ã కానుకలు ఇవ్వడం మానేశారు. ఇచ్చే నిత్యావసరాల్లో పేదలకు కాస్తోకూస్తో పోషకాహారంగా ఉండే కందిపప్పును సైతం విడుదల చేయడం లేదు. కనీసం పండగల సందర్భంగా కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.
అన్నింటా కోతలే
తెదేపా ప్రభుత్వ హయాంలో కిలో రూ.40 చొప్పున ప్రతి కార్డుదారుడికి రెండు కిలోల కందిపప్పు ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కార్డుకు కిలో కందిపప్పే పరిమితం చేయడంతో పాటు ధరను రూ.67కు పెంచారు. కరోనా సమయం నుంచి కార్డుదారులకు కేంద్ర ఉచితంగా ఇస్తున్న బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కిలో రూపాయి చొప్పన ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చేవారు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన బియ్యానికి తిలోదకాలిచ్చేశారు. ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు ఇస్తున్నా పంచదార ఏనెలలో దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి ఉండగా, ఏడాదిన్నరగా కందిపప్పు ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. ప్రతి నెలా కార్డుదారుల అవసరాలకు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ కందిపప్పు కేటాయింపులు చేస్తున్నా.. ప్రొక్యూర్మెంట్ చేయలేని కారణంగా కార్డుదారులకు ఎగనామం పెడుతున్నా ప్రభుత్వంలో మాత్ర కనీస చలనం లేదు.
నిధులు దారి మళ్లించి..
జిల్లాలో పేదలకు ఇవ్వాల్సిన కందిపప్పును ఎగగొట్టడం ద్వారా ప్రభుత్వం రూ.150 కోట్ల మేర దారి మళ్లించింది. జిల్లాల విభజన అనంతరం కృష్ణాలో 5.26 లక్షల తెల్లరేషన్కార్డులున్నాయి. వీరికి ప్రతి నెలా కిలో చొప్పున 526 మెట్రిక్.టన్నుల కందిపప్పు అవసరం. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ లెక్క ప్రకారం రమారమి 13,150 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉండగా ఇచ్చింది కేవలం 2,400 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే 25 నెలల వ్యవధిలో పేదలకు అందించాల్సిన 11,100 టన్నుల కందిపప్పుకు గండికొట్టి మార్కెట్ ధర ప్రకారం రూ.150 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించింది.
కార్డుదారులపై నెలకు రూ.2.80 కోట్ల అదనపు భారం
గతంలో ఎలా ఉన్నా కరోనా సమయం నుంచి ఆరోగ్య స్పృహ పెరగడం, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు రోజుకో రకంగా పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో 70 శాతం మంది కార్డుదారులు కందిపప్పు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పేదవర్గాల అవసరాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం కందిపప్పును బయట కొనుగోలు చేయడం ద్వారా నెలకు సగటున రూ.2.80 కోట్ల అదనపు భారం భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం