జగన్ షాకులు.. జనం కేకలు!
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు.
సామాన్యులకు భారంగా మారిన ట్రూఅప్ ఛార్జీలు
ఒకే బిల్లులో మూడు సర్దుబాటు ఛార్జీల వడ్డన
ఐదేళ్లలో ప్రజలపై రూ. వందల కోట్లలో భారం
ఈనాడు, అమరావతి
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. అన్ని వర్గాల ప్రజలూ జగన్ బాధితులే. అటు పేదల నుంచి ఎగువ తరగతి వరకు అందరినీ దారుణంగా వంచించారు ముఖ్యమంత్రి. బిల్లుల భారం దెబ్బకు స్విచ్ వేయాలంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి నెలకొంది. అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలు మరింత భారంగా మారుతున్నాయి. ఒకేసారి మూడు సర్దుబాటు ఛార్జీలను మోపుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రజలపై ఈ ఛార్జీల భారం సుమారు రూ. 700 కోట్ల మేర పడుతోంది. భారీగా వస్తున్న కరెంటు బిల్లులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు, ఈ బిల్లులు మరింత కుంగదీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. సర్దుబాటు భారం వినియోగదారుల నడ్డి విరుస్తోంది. డిస్కమ్కు నష్టాలు వచ్చాయని ఇప్పుడు వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2014-15 నుంచి 2018-19 మధ్య విద్యుత్తు వ్యాపారంలో పంపిణీ సంస్థకు నష్టాలు వచ్చాయని ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ కాలంలో వాడిన యూనిట్కు 22 పైసలు చొప్పున లెక్కగట్టి బిల్లులో విధిస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి విధిస్తున్నారు. మొత్తం 36 నెలలు విధించే ఈ ఛార్జీల్లో ఇప్పటి వరకు 22 నెలలకు వేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై ఈ భారం రూ.270 కోట్లు విధించారు. దీనికి అదనంగా.. 2021-22 ఆర్థిక సంవత్సర నష్టాల పేరుతో ఎఫ్పీపీసీఏ 1 (ఇంధన, విద్యుత్తు సర్దుబాటు ఛార్జీలు)ను మరో రూ.వంద కోట్ల భారం మోపారు. దీనిని 2021-22లో ఏ నెలలో వాడిన యూనిట్లను 2023-24లో అదే నెలలో విద్యుత్తు బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. యూనిట్కు 20 పైసలు నుంచి గరిష్ఠంగా 66 పైసల వరకు భారం విధించారు. మొదటి త్రైమాసికంలో యూనిట్కు రూ.0.20, రెండో త్రైమాసికంలో యూనిట్ రూ.0.63, మూడో త్రైమాసికంలో రూ.0.63, చివరి త్రైమాసికంలో ప్రతి యూనిట్పై రూ.0.66 చొప్పున లెక్కించి విధిస్తున్నారు. 2023-24లో ఏప్రిల్ నుంచి సంబంధిత నెలలో వాడిన విద్యుత్తుపై తర్వాత నెలలో వచ్చే బిల్లులో లెక్కించి ఎఫ్పీపీసీఏ 2 పేరుతో యూనిట్కు 40 పైసలు చొప్పున సర్దుబాటు చేస్తున్నారు. ఈ భారం రూ.330 కోట్ల మేర పడింది. మొత్తం కలిపి మూడు రకాల భారాలతో ప్రజలపై రూ.700 కోట్ల మేర సర్దుబాటు ఛార్జీల పేరిట వడ్డించారు. భారం మొత్తం బిల్లులో 10 శాతం పైగానే ఉంటోంది.
వాడింది ఒకరు.. కట్టాల్సింది మరొకరు: సర్దుబాటు భారం కేవలం ఇప్పుడున్న వినియోగదారులకే కాదు.. పాత వారికీ వర్తింపజేసింది. ఫలితంగా గతంలో విద్యుత్తు కనెక్షన్.. ఆ తర్వాత తొలగించిన వారూ బాధితులుగా మారుతున్నారు. ఆ డోర్ నంబర్లో ఇప్పుడు ఉన్న వారికి ట్రూఅప్ ఛార్జీలను విధిస్తున్నారు. అప్పుడు విద్యుత్తు వాడిన వినియోగదారుడు లేకపోయినా.. అదే ప్రాంగణం అనే కారణంతో అసలు సంబంధమే లేని వారిపైనా విధించడంపై తీవ్ర విమర్శలున్నాయి. కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తామని విద్యుత్తు సిబ్బంది బెదిరిస్తున్నారు.
భారీగా పెరిగింది
-అబ్దుల్ వాహెద్, పెడన
గతంలో ఇంటి సర్వీసుకు రూ.1500లు మించి కట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో రూ2600ల వరకు బిల్లులొస్తున్నాయి. కరెంటుకే ఇంత అయితే మిగిలిన ఖర్చులు ఎలా.
రూ. వేలల్లో వస్తోంది
- కాగిత రాంబాబు, అర్తమూరు
గతంలో రూ 200 నుంచి రూ 300 వచ్చే బిల్లు నేడు వెయ్యి రూపాయలు దాటింది. ఇంత మొత్తం ఎలా చెల్లించాలో తెలియడం లేదు.
న్యూస్టుడే, పెడన, బంటుమిల్లి
అదనపు వడ్డింపు
- వెనిగెళ్ల ఫణి, బాపులపాడు
జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని ఏడాది కూడా పూర్తి కాలేదు. మొదట్లో కనెక్షన్లు ఇవ్వకుండానే బిల్లులు జారీ చేసిన అధికారులు, గత కొన్ని నెలలుగా ఎఫ్పీపీసీఏ ఛార్జీల పేరుతో ప్రతి నెలా రూ.50 వసూలు చేస్తున్నారు.
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసుర వారి.. నరకాపురి..!
[ 06-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు. -
ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!
[ 06-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్ విడుదల కాలేదు. -
ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్!
[ 06-05-2024]
ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు కళాశాలల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకున్నారు. -
పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
[ 06-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. -
ఉట్టిపడిన సంప్రదాయం
[ 06-05-2024]
రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!