జగన్ షాకులు.. జనం కేకలు!
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు.
సామాన్యులకు భారంగా మారిన ట్రూఅప్ ఛార్జీలు
ఒకే బిల్లులో మూడు సర్దుబాటు ఛార్జీల వడ్డన
ఐదేళ్లలో ప్రజలపై రూ. వందల కోట్లలో భారం
ఈనాడు, అమరావతి
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. అన్ని వర్గాల ప్రజలూ జగన్ బాధితులే. అటు పేదల నుంచి ఎగువ తరగతి వరకు అందరినీ దారుణంగా వంచించారు ముఖ్యమంత్రి. బిల్లుల భారం దెబ్బకు స్విచ్ వేయాలంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి నెలకొంది. అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలు మరింత భారంగా మారుతున్నాయి. ఒకేసారి మూడు సర్దుబాటు ఛార్జీలను మోపుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రజలపై ఈ ఛార్జీల భారం సుమారు రూ. 700 కోట్ల మేర పడుతోంది. భారీగా వస్తున్న కరెంటు బిల్లులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు, ఈ బిల్లులు మరింత కుంగదీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. సర్దుబాటు భారం వినియోగదారుల నడ్డి విరుస్తోంది. డిస్కమ్కు నష్టాలు వచ్చాయని ఇప్పుడు వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2014-15 నుంచి 2018-19 మధ్య విద్యుత్తు వ్యాపారంలో పంపిణీ సంస్థకు నష్టాలు వచ్చాయని ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ కాలంలో వాడిన యూనిట్కు 22 పైసలు చొప్పున లెక్కగట్టి బిల్లులో విధిస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి విధిస్తున్నారు. మొత్తం 36 నెలలు విధించే ఈ ఛార్జీల్లో ఇప్పటి వరకు 22 నెలలకు వేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై ఈ భారం రూ.270 కోట్లు విధించారు. దీనికి అదనంగా.. 2021-22 ఆర్థిక సంవత్సర నష్టాల పేరుతో ఎఫ్పీపీసీఏ 1 (ఇంధన, విద్యుత్తు సర్దుబాటు ఛార్జీలు)ను మరో రూ.వంద కోట్ల భారం మోపారు. దీనిని 2021-22లో ఏ నెలలో వాడిన యూనిట్లను 2023-24లో అదే నెలలో విద్యుత్తు బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. యూనిట్కు 20 పైసలు నుంచి గరిష్ఠంగా 66 పైసల వరకు భారం విధించారు. మొదటి త్రైమాసికంలో యూనిట్కు రూ.0.20, రెండో త్రైమాసికంలో యూనిట్ రూ.0.63, మూడో త్రైమాసికంలో రూ.0.63, చివరి త్రైమాసికంలో ప్రతి యూనిట్పై రూ.0.66 చొప్పున లెక్కించి విధిస్తున్నారు. 2023-24లో ఏప్రిల్ నుంచి సంబంధిత నెలలో వాడిన విద్యుత్తుపై తర్వాత నెలలో వచ్చే బిల్లులో లెక్కించి ఎఫ్పీపీసీఏ 2 పేరుతో యూనిట్కు 40 పైసలు చొప్పున సర్దుబాటు చేస్తున్నారు. ఈ భారం రూ.330 కోట్ల మేర పడింది. మొత్తం కలిపి మూడు రకాల భారాలతో ప్రజలపై రూ.700 కోట్ల మేర సర్దుబాటు ఛార్జీల పేరిట వడ్డించారు. భారం మొత్తం బిల్లులో 10 శాతం పైగానే ఉంటోంది.
వాడింది ఒకరు.. కట్టాల్సింది మరొకరు: సర్దుబాటు భారం కేవలం ఇప్పుడున్న వినియోగదారులకే కాదు.. పాత వారికీ వర్తింపజేసింది. ఫలితంగా గతంలో విద్యుత్తు కనెక్షన్.. ఆ తర్వాత తొలగించిన వారూ బాధితులుగా మారుతున్నారు. ఆ డోర్ నంబర్లో ఇప్పుడు ఉన్న వారికి ట్రూఅప్ ఛార్జీలను విధిస్తున్నారు. అప్పుడు విద్యుత్తు వాడిన వినియోగదారుడు లేకపోయినా.. అదే ప్రాంగణం అనే కారణంతో అసలు సంబంధమే లేని వారిపైనా విధించడంపై తీవ్ర విమర్శలున్నాయి. కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తామని విద్యుత్తు సిబ్బంది బెదిరిస్తున్నారు.
భారీగా పెరిగింది
-అబ్దుల్ వాహెద్, పెడన
గతంలో ఇంటి సర్వీసుకు రూ.1500లు మించి కట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో రూ2600ల వరకు బిల్లులొస్తున్నాయి. కరెంటుకే ఇంత అయితే మిగిలిన ఖర్చులు ఎలా.
రూ. వేలల్లో వస్తోంది
- కాగిత రాంబాబు, అర్తమూరు
గతంలో రూ 200 నుంచి రూ 300 వచ్చే బిల్లు నేడు వెయ్యి రూపాయలు దాటింది. ఇంత మొత్తం ఎలా చెల్లించాలో తెలియడం లేదు.
న్యూస్టుడే, పెడన, బంటుమిల్లి
అదనపు వడ్డింపు
- వెనిగెళ్ల ఫణి, బాపులపాడు
జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని ఏడాది కూడా పూర్తి కాలేదు. మొదట్లో కనెక్షన్లు ఇవ్వకుండానే బిల్లులు జారీ చేసిన అధికారులు, గత కొన్ని నెలలుగా ఎఫ్పీపీసీఏ ఛార్జీల పేరుతో ప్రతి నెలా రూ.50 వసూలు చేస్తున్నారు.
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి