అధికార పార్టీ నాయకులా.. మజాకా..
శ్రీసత్యసాయి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎన్నికల కోసం రాత్రిపూట కర్ణాటక నుంచి చిలమత్తూరు మండలంలోని గ్రామాల మీదుగా మద్యం అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది.
కర్ణాటక మద్యం అక్రమ రవాణా
అనంతపురం, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎన్నికల కోసం రాత్రిపూట కర్ణాటక నుంచి చిలమత్తూరు మండలంలోని గ్రామాల మీదుగా మద్యం అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది. ఆయన కోసం చిలమత్తూరు మండల ప్రజాప్రతినిధి బంధువు తన కారులో మద్యం తీసుకొస్తుండగా అదే మండల పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు సహకరిస్తున్నట్లు సమాచారం. రాత్రిపూట కారులో మద్యం తీసుకొస్తుండగా, ఓ కానిస్టేబుల్ వాహనం ముందు ఎస్కార్ట్లా ద్విచక్ర వాహనంలో వచ్చేవాడని తెలుస్తోంది. మరో కానిస్టేబుల్ ఫోన్లోనే మొత్తం ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. చిలమత్తూరు మండలంలోని గ్రామాల మీదుగా మద్యం తరలింపు జరుగుతున్నట్లు తెలుసుకొన్న ఓ పోలీస్ అధికారి రెండు రోజుల క్రితం ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. ఆ రోజు పోలీస్ కానిస్టేబుల్కు చెందిన ద్విచక్ర వాహనంలో ఇతరులు వస్తుండగా, ఆయన వెనుక కారు వచ్చినట్లు గుర్తించార[ు. ఆ కారును మండల ప్రజా ప్రతినిధి బంధువు నడుపుతుండగా, అందులో స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ను గుర్తించి ఫోన్ చేశారు. అయినా కానిస్టేబుల్ ఫోన్ తీయలేదు. మరో వైపు మద్యం తరలిస్తున్న కారును అధికారి తన వాహనంతో వెంబడించారు. వారు కారును అత్యంత వేగంగా నడిపి తప్పించుకొన్నారు. ఇదే విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపాలని కోరినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!