logo

జగన్‌ రూ.లక్ష కోట్లు లూటీ: బీవీ

సీఎం జగన్‌ రూ.లక్ష కోట్ల దాకా లూటీ చేశారని జిల్లా తెదేపా అధ్యక్షుడు బీవీ వెంకట్రాముడు ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల తాళిబొట్లను తెంచారని దుయ్యట్టారు.

Published : 13 Apr 2024 05:11 IST

పుట్టపర్తి, న్యూస్‌టుడే : సీఎం జగన్‌ రూ.లక్ష కోట్ల దాకా లూటీ చేశారని జిల్లా తెదేపా అధ్యక్షుడు బీవీ వెంకట్రాముడు ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల తాళిబొట్లను తెంచారని దుయ్యట్టారు. ఏపీలో కొత్తగా జె బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేసి సంపాదించిన రూ.లక్ష కోట్ల దాకా సొమ్ము లూటీ చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వమే మద్యం అమ్మేలా చేశారని దుయ్యబట్టారు. మద్యం విక్రయాలను దాదాపుగా 34.5 శాతానికి పెంచడానికి జగన్‌ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని