ఎన్నికల విధుల మినహాయింపుపై కలెక్టర్ ఆరా
జిల్లా జలవనరుల శాఖలో చోటు చేసుకున్న సార్వత్రిక ఎన్నికల విధుల మినహాయింపు భాగోతంపై కలెక్టర్ వినోద్కుమార్ ఆరా తీశారు. ఏ సమస్య లేకపోయినా 20 మందికిపైగా ఎన్నికల విధుల నుంచి మినహాయించినట్లు తేలింది.
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: జిల్లా జలవనరుల శాఖలో చోటు చేసుకున్న సార్వత్రిక ఎన్నికల విధుల మినహాయింపు భాగోతంపై కలెక్టర్ వినోద్కుమార్ ఆరా తీశారు. ఏ సమస్య లేకపోయినా 20 మందికిపైగా ఎన్నికల విధుల నుంచి మినహాయించినట్లు తేలింది. ఈ తతంగంపై ఈ నెల 11న ‘ఎన్నికల విధులపై రాజకీయం... జలవనరుల శాఖలో చేతివాటం’ అన్న కథనాన్ని ‘ఈనాడు’ కథనానికి కలెక్టర్ స్పందించి విచారణ చేయిస్తున్నారు. శుక్రవారం జలవనరులశాఖ పరిధిలోని ఎంఐ, హెచ్చెల్సీ, హంద్రీనీవా ప్రాజెక్టుల అధికారులను కార్యాలయానికి పిలిపించారు. ఒక రోజు ముందే ప్రొఫార్మా పెట్టినట్లు తెలిసింది. మీ ప్రాజెక్టు పరిధిలో మంజూరీ పోస్టులు ఎన్ని? ఇపుడు ఎంతమంది పని చేస్తున్నారు. ఎన్నికల విధులకు ఎంత మందిని సిఫార్సు చేశారు. ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారు.. వంటి వివరాలను ఆగమేఘాలపై తీసుకున్నారు. ఈ వివరాలను కలెక్టర్ కార్యాలయ ఎన్ఐసీలో సరిపోల్చారు. హంద్రీనీవా నుంచి వెళ్లిన జాబితాలోనే మాయాజాలం నెలకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సమగ్ర వివరాలతో మళ్లీ జాబితాను తీసుకుని రావాలని ఆదేశించినట్లు చర్చ నడుస్తోంది. ఈ బాగోతం వెనుక వ్యవహరం నడిపిన ఇద్దరు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.
క్వాలిటీ ఇంజినీర్లా... మజాకా
జిల్లా జలవనరుల శాఖ అనుబంధంగా క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఉంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఈ డివిజన్ అనంతలోనే ఉంది. ఈ డివిజన్లో పని చేస్తున్న ఇంజినీర్లు, ఉద్యోగులు కొందరు అతి తెలివి ఉపయోగించి అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎన్నికల విధుల నుంచి తప్పించుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో తగిన పని లేక.. ముదిగుబ్బ మండలం జిల్లెడు బండ ప్రాజెక్టులో పని చేసేందుకు తాత్కాలికంగా నియమించారు. ఇదే అదనుగా భావించిన కొందరు ఇంజినర్లు, ఉద్యోగులు రెండు జిల్లాల్లోనూ ఎన్నికల విధుల నుంచి తప్పించుకున్నారు. దీనిపైనా కూడా కలెక్టర్ ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల