రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా మార్చేశారు: సునీత
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.
తెదేపాలో చేరిన వారితో పరిటాల సునీత, శ్రీరామ్
అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), ఆత్మకూరు, న్యూస్టుడే: దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ మద్యంతోనే లక్ష కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. శుక్రవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాత్రి..సింగంపల్లి, సింగంపల్లి తండా, వై.కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. మద్యపానం నిషేధిస్తామని చెబితే మహిళంతా నమ్మి జగన్కు ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికే తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలోనూ ఆంధ్రప్రదేశ్లో 31.4 శాతం మంది మద్యం తాగుతున్నట్లు తేలిందన్నారు. ఐదేళ్లలో మద్యం తాగుతున్న వారి సంఖ్య రెండింతలు పెరిగిపోయిందన్నారు. మద్యం మాఫియా ద్వారా జే బ్రాండ్ గ్యాంగ్ రూ.లక్షల కోట్లను అప్పనంగా కొట్టేశారని, బ్లాక్ మార్కెట్ అమ్మకాల మీద వచ్చే సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్కు తరలిపోయిందని ఆరోపించారు.
భారీగా తెదేపాలోకి వలసలు
రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా రాక్షస శకం ముగిసిందని, ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి దుకాణం సర్దుకునే సమయం ఆసన్నమైందని సునీత విమర్శించారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ, ఇందిరమ్మ కాలనీ, కళాకారుల కాలనీల నుంచి 35 కుటుంబాలు, ఆత్మకూరు నుంచి 8 కుటుంబాలు, అనంతపురం గ్రామీణం పాపంపేట నుంచి 8 కుటుంబాలు తెదేపాలోకి చేరారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నామినేషన్ల లోపు రాప్తాడులో వైకాపా అంతా ఖాళీ కావడం ఖాయమన్నారు. ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?