విషతుల్య ఆహారం తిని 150 మందికి అస్వస్థత
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి బుడ్డారెడ్డిమిద్దెలు వద్ద శుక్రవారం శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం చేశారు.
కనగానపల్లి మండలం కుర్లపల్లిలో ఘటన
అస్వస్థతకు గురై ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
కనగానపల్లి, ధర్మవరం, న్యూస్టుడే : శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి బుడ్డారెడ్డిమిద్దెలు వద్ద శుక్రవారం శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం చేశారు. 400 మంది భోజనం తినగా అందులో 150 మందికి ఫుడ్ పాయిజన్ (ఆహారం విషతుల్యం) అయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కళ్లు తిరగడం, విరేచనాలు కావడంతో నీరసించిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. అంబులెన్స్, 108, ప్రైవేటు వాహనాల్లో కుర్లపల్లి నుంచి అస్వస్థతకు గురైన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేర్పించారు. అస్వస్థతకు గురైన వారు అధిక సంఖ్యలో రావడంతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాలు నిండిపోయాయి. పలువురు చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యులు వారిని పరీక్షించి చికిత్సలు అందించారు. పాయసం, పులిహోరా తిన్న వారే ఎక్కువ మంది అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. బాధితులతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు నిండిపోయాయి. కుర్లపల్లి, బుడ్డారెడ్డి మిద్దెలు ప్రాంతానికి చెందిన వారే అనారోగ్యం పాలైన వారిలో ఉన్నారు. 108 వాహనాలు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాల్లోనూ ఆసుపత్రులకు బాధితులను తీసుకొచ్చారు. ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ధర్మవరం డీఎస్పీ టి.శ్రీనివాసులు ఆసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బాధితుల్లో కొందరికి సీరియస్గా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు. ఆహారం విషతుల్యం (ఫుడ్ పాయిజనింగ్) ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
మంచాల కొరతతో బెంచీపైనే పడుకున్న చిన్నారి, బంధువులు
108లో కిక్కిరిసి బాధితులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారిలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్