దారి చూపని వైకాపా.. దాతృత్వం చూపిన ఆర్డీటీ
వైకాపా ప్రభుత్వం వచ్చాక రోడ్ల పరిస్థితి అతి దారుణంగా మారింది. కనీసం మరమ్మతులకు నోచుకోని రహదారులెన్నో.. ఏ రోడ్డుపైనా తట్టెడు మట్టి వేసిన మరమ్మతు చేసి దాఖలాలు లేవు. వంతెనల పరిస్థితి అయితే మరీ అధ్వానం.
ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి- కనంపల్లి గ్రామాల మధ్య
చిత్రావతి నదిపై గ్రామస్థులు నిర్మించుకున్న తాత్కాలిక వంతెన (పాత చిత్రం)
వైకాపా ప్రభుత్వం వచ్చాక రోడ్ల పరిస్థితి అతి దారుణంగా మారింది. కనీసం మరమ్మతులకు నోచుకోని రహదారులెన్నో.. ఏ రోడ్డుపైనా తట్టెడు మట్టి వేసిన మరమ్మతు చేసి దాఖలాలు లేవు. వంతెనల పరిస్థితి అయితే మరీ అధ్వానం. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి దగ్గరగా.. పోతుల నాగేపల్లి- కనంపల్లి గ్రామాల మధ్య చిత్రావతిపై కట్టిన వంతెన, రోడ్డు నిర్మాణం.. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనానికి మచ్చుతునకగా మిగిలింది. చిత్రావతి నది వరదల కారణంగా ఈ గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఇరుగ్రామాల్లో 3 వేల మందికిపైగా జనాభా ఉంటారు. రాకపోకలు ఆగి ప్రజలకు ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో రహదారి, వంతెన నిర్మాణంపై టెండర్ల దశ వరకు వచ్చి ఆగిపోయాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. ఇక కన్నెత్తి చూసింది లేదు. 2022లో గ్రామాల మధ్య వరదలకు వంతెన మరింత దెబ్బతిని కాలినడకకూ వీలుకాని విధంగా మారింది. ప్రయాణం సాగించలేక ఇరుగ్రామాల ప్రజలు నాయకులను ఎన్నోసార్లు వేడుకొన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని ఇరు గ్రామస్థులు చందాలు వేసుకుని సిమెంటు పైపులు వేసి దానిపై మట్టి కప్పి రహదారి ఏర్పాటు చేసుకున్నారు. వీరి ఇబ్బందిని చూసి రూ.కోటి మొత్తంతో చెక్డ్యాం, వంతెన నిర్మాణానికి ఆర్డీటీ సంస్థ ముందుకొచ్చి పూర్తి చేసింది. ఓట్లు అడగడానికి ముందుంటారు.. పనులు చేయడానికి ఉండరా? అంటూ స్థానికులు నాయకులను ప్రశ్నిస్తున్నారు.
ఆర్డీటీ నిర్మించిన చెక్డ్యాం వంతెన
ఈనాడు, అనంతపురం, న్యూస్టుడే, ధర్మవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ