పాలెగాళ్ల రాజ్యం పోవాలి.. ప్రజాపాలన రావాలి
పాలెగాళ్ల రాజ్యంలో ప్రజలు విసిగి పోయారని, ప్రజాపాలన రావాలని అంతా కోరుకుంటున్నట్లు కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీ తెదేపా అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి అన్నారు.
కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు గొర్రె పిల్లను బహూకరిస్తున్న కురుబ సంఘం నాయకులు, అనంతపురం, హిందూపురం ఎంపీ అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి తదితరులు
కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్టుడే: పాలెగాళ్ల రాజ్యంలో ప్రజలు విసిగి పోయారని, ప్రజాపాలన రావాలని అంతా కోరుకుంటున్నట్లు కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీ తెదేపా అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య, కళ్యాణదుర్గం ఇన్ఛార్జి బాల్యం రాజేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి రాగానే కురుబలకు రుణాలిచ్చి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. కురుబలకు మొదట రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెదేపానే అని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందన్నారు. తాము గెలిచాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నర్సింగ్ కళాశాల తీసుకొస్తామని, కనకదాస విగ్రహాలు ఏర్పాటు చేసి, గుడికట్ల విజయోత్సవాలు నిర్వహించేలా చూస్తామన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు కురుబలు కంబలి, గొర్రె పిల్లను బహూకరించి, గజమాలతో సత్కరించారు.
భారీగా తరలి వచ్చిన కురుబలు
కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయం
రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందన్నారు. జగన్కు ఇదే మొదటి, చివరి అవకాశమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాశనం అవుతున్న వ్యవస్థలను పవన్కల్యాణ్ అడ్డుకొంటూ రోడ్లపైకి వస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట