టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ
ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.
యువకుడి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు
అశోక్రెడ్డి
బత్తలపల్లి, న్యూస్టుడే : ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి కుమారుడు అశోక్రెడ్డి, బత్తలపల్లి మండలం అప్రాచెరువుకు చెందిన విష్ణు చెన్నైలో బీటెక్ పూర్తి చేసుకుని ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.మధ్యాహ్నం ముదిగుబ్బ మండలం రాళ్లఅనంతపురంలోని అశోక్రెడ్డి అక్క ఇంటికి చేరుకొని అక్కడ భోజనం చేసి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలోని నల్లబోయనపల్లి వద్దకు రాగానే నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయి. దీంతో ఒకే మార్గంలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని అధికమించి వెళ్లే (ఓవర్టెక్) క్రమంలో వారి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పరు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు అశోక్రెడ్డి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకవైపు కూర్చున్న స్నేహితుడు విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అశోక్రెడ్డి తండ్రి హనుమంతరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
కనగానపల్లి, న్యూస్టుడే: కనగానపల్లి మండలం పాలబావి మిట్ట సమీపం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందగా ముగ్గురు గాయపడినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణయ్య (61) ఉదయం ద్విచక్ర వాహనంలో ధర్మవరానికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో పాలబావి మిట్ట సమీపానికి రాగానే అదే రహదారి వెంబడి ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు కలిసి వేగంగా వస్తూ.. వాహన వేగాన్ని అదుపు చేయలేక ఎదురుగా కృష్ణయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం పట్టణం 5వ రోడ్డుకు చెందిన నారాయణస్వామి, లోకేశ్, సోనూ తీవ్రంగా గాయపడటంతో వైద్యం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే