logo

జాతీయస్థాయిలో అనంతకు ఖ్యాతి

మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Published : 20 May 2024 04:40 IST

కల్లూరులో నీలం సంజీవరెడ్డి విగ్రహం వద్ద నాయకులు, అభిమానులు

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే : మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంజీవరెడ్డి కూడలిలో ఉన్న నీలం సంజీవరెడ్డి విగ్రహానికి ఏడీసీసీ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ తరిమెల కోనారెడ్డి, అభిమానులు పూల మాలలువేసి, కొబ్బరికాయ కొట్టి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డి అనంతపురం జిల్లాకు జాతీయస్థాయిలో పేరుతెచ్చారని పేర్కొన్నారు. నీలం సంజీవరెడ్డి చేసిన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రదీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పెద్దన్న, రాంప్రసాద్, నల్లపరెడ్డి, ఏకే నరసింహులు, చంద్రనాథ్‌రెడ్డి, పుల్లన్న, సంగప్ప, రామచంద్ర, రామంజి, సుధాకర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఆర్‌ యూత్‌ సభ్యులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని