తాడిపత్రి అల్లర్ల కేసులో 728 మంది నిందితులు
పోలింగ్ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు.
ఇప్పటికే 91 మందికి రిమాండ్
ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక
ఈనాడు డిజిటల్, అనంతపురం: పోలింగ్ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు. ఈ మేరకు సిట్ అధికారులు ఎన్నికల సంఘానికి సోమవారం నివేదిక అందించారు. పోలింగ్ రోజు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. తెదేపా ఏజెంట్లపై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ మరుసటిరోజు పెద్దారెడ్డి తెదేపా నేత సూర్యముని ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకులు ప్రతిఘటించడంతో రెండువర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. సీఐ మురళీకృష్ణతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైకాపా, తెదేపా సానుభూతిపరులపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రిలో అల్లర్లను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే కారణంతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అల్లర్లపై విచారించేందుకు ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ బృందం శని, ఆదివారాల్లో తాడిపత్రిలోనే ఉండి విచారణ చేపట్టింది. పోలీసు అధికారులతో పాటు రాళ్ల దాడిని చూసిన ప్రత్యక్ష సాక్షులను విచారించింది. బృందం సభ్యులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇప్పటికే 396 మందిని గుర్తించారు. 332 మందిని గుర్తించాల్సి ఉంది. 91 మందిని అరెస్టు చేయగా..634 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. ఇందులో ముగ్గురికి 41ఏ నోటీసులు జారీ చేసినట్లు సిట్ బృందం ఎన్నికల సంఘానికి నివేదిక అందజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం